గోల్నాక, ఏప్రిల్ 9 : విధులు ముగించుకొని నడుచుకుంటూ వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీ కొని పారిశుధ్య కార్మికులు దుర్మరణం చెందిన విషాద ఘటన అంబర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ టి.కిరణ్ కుమార్, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మూసారాంబాగ్ సిరిపిరం కాలనీకి చెందిన పుష్ప(50) అంబర్పేట అలీకేఫ్ దుర్గానర్ ప్రాంతంలో పారిశుధ్య కార్మికురాలిగా విధులు నిర్వహిస్తుంది. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం 12.30 సమయంలో పారిశుధ్య పర్వవేక్షకుడికి ఫొటోతో పాటు హాజరు వేయించుకొని విధులు ముగించుకుంది.
అదే సమయంలో ఇంటికి వెళ్తేందుకు అలీకేఫ్ చౌరస్తాలోని బస్సు స్టాపుకు వెళ్లేందుకు నడుచుకుంటూ వెళ్తుండగా దిల్సుఖ్నగర్ డిపోకు చెందిన (ఏపీ29జెడ్3048) ఆర్టీసీ బస్సు అంబర్పేట నుంచి గోల్నాక వైపు వేగంగా మలుపు తీసుకుంటున్న క్రమంలో పుష్పను ముందునుంచి ఢీకొంది. ముందు చక్రం పుష్పపై వెళ్లండతో తీవ్రగాయాలతో పాటు తల భాగం నుజ్జునుజ్జు కావడంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితిరాలి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.