కోహీర్ నుంచి ప్రయోగం
45 కిలోమీటర్లు కరెంట్ లైన్ పూర్తి
వికారాబాద్ నుంచి కోహీర్ వరకు తీగల బిగింపు
ట్రయల్ రన్ పూర్తి చేసిన అధికారులు
కోహీర్, మార్చి 28: వాయు కాలుష్యానికి చరమగీతం పాడేందుకు రైల్వేశాఖ ప్రణాళికలు తయారు చేసింది. ఇందులో భాగంగా రైల్వే భద్రతా విభాగం కమిషనర్ ఏ.కే.రాయ్ ఆధ్వర్యంలో కరెంట్ సరఫరాతో రైళ్లను నడిపేందుకు అధికారులు ట్రయల్ రన్ చేపట్టారు. వికారాబాద్ నుంచి కోహీర్ వరకు 45 కిలోమీటర్ల వరకు కరెంట్ తీగలను బిగించారు. వికారాబాద్ నుంచి మహారాష్ట్రలోని పర్లీ పట్టణం వరకు 250కిలోమీటర్ల మేర తీగలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే కరెంట్ స్తంభాలు, తీగల ఏర్పాటు పూర్తి కావడంతో కోహీర్ వరకు కరెంట్ తో నడిచే రైలును ప్రయోగాత్మకంగా పరిశీలించారు. డిజిల్ ఇంజిన్తో కోహీర్ దక్కన్ రైల్వేస్టేషన్కు వచ్చిన రైలుకు కరెంటుతో నడిచే ఇంజిన్ను అమర్చారు. దీంతో 2,500వోల్టుల విద్యుత్ సరఫరా అవుతుంది.
ఇవి కూడా చదవండి..
వీటితో నోటి అల్సర్లు తగ్గించండి..
చిన్నారుల్లో కొవిడ్ లక్షణాలు.. బెంగళూరులో 470 మంది గుర్తింపు