బోనకల్లు, ఏప్రిల్ 16 : యూపీఎస్సీ ఫలితాల్లో ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం గోవిందాపురం-ఎల్ గ్రామానికి చెందిన రావూరి సాయి అలేఖ్య ఆలిండియా స్థాయిలో 938వ ర్యాంకు సాధించి ఐపీఎస్కు ఎంపికైంది. సివిల్స్కు ఎంపికైన అలేఖ్య తండ్రి మధిర టౌన్ పోలీస్స్టేషన్లో హెడ్కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. కాగా.. ఐపీఎస్కు ఎంపికైన సాయి అలేఖ్యకు ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు తదితరులు అభినందనలు తెలిపారు.
చిన్ననాటి నుంచి బాగా చదివి ఐఏఎస్, ఐపీఎస్ కావాలని మా నాన్న చెబుతుండేవారు. పేపర్ కటింగ్లు నాకు తీసుకొచ్చి ఇచ్చి చదువుకోమని చెప్పేవారు. వాటిని చదివి నేను కూడా సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని అనుకునే దానిని. ఇంటర్ పూర్తయిన తర్వాత బీటెక్ వైపు వెళ్లకుండా డిగ్రీ చదివాను. ఎంఏలో రూరల్ డెవలప్మెంట్ బెనారస్ ఇందు యూనివర్సిటీలో పూర్తి చేశాను. సివిల్స్ ప్రయత్నం చేశాను. నాన్న కోరికను నేను సాధించడం ఎంతో ఆనందం కలిగించింది. మా అమ్మ ఎప్పటికప్పుడు బాధ్యతలు గుర్తు చేస్తూ తన వెన్నంటే ఉంటూ ధైర్యాన్నిచ్చింది.