Loksabhs Elections 2024 : లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం తప్పదని కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి అన్నారు. జూన్ 4 తర్వాత కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుందని ఆమె పేర్కొన్నారు. యూపీలోని ఫతేపూర్లో గురువారం సాధ్వి నిరంజన్ జ్యోతి విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ ప్రకటనను ప్రస్తావించగా అధిర్ రంజన్ టీఎంసీకి ఓటు వేయవద్దని, కాషాయ పార్టీకి ఓటేయాలని ప్రజలను కోరుతున్నారని చెప్పారు.
బీజేపీ క్రమశిక్షణతో కూడిన కార్యకర్తల బలంతో ఎన్నికల్లో పోరాడుతోందని అన్నారు. యూపీలోని 80 స్దానాలనూ కాషాయ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతవుతుందని జోస్యం చెప్పారు.మరోవైపు కాంగ్రెస్ను వీడి కాషాయ పార్టీలో చేరిన రాధిక ఖేరా హస్తం పార్టీ లక్ష్యంగా తీవ్రస్ధాయిలో విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణకు చోటులేదని అన్నారు. ఆ పార్టీలో వారు ఎవరూ కలిసి నడవడానికి లేదని, ఒకరిని ఒకరు వెనక్కి లాగుతుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి కాంగ్రెస్ పార్టీలో కేవలం ఓ కుటుంబమే మిగులుతుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ను ఒకరి తర్వాత ఒకరు వీడుతున్నారని, 30,40 ఏండ్ల నుంచీ పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలు, నేతలకు ఏమాత్రం గుర్తింపు లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీని గాంధీల అల్లుడు రాబర్ట్ వాద్రా పేరుతో రాసిచ్చేస్తారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి వాద్రా యజమాని అని పార్టీలో ఆయన ఏదైనా పొందేందుకు అర్హుడని రాధిక ఖేరా చెప్పారు.
Read More :
Cash Seized | హైదరాబాద్ నుంచి గుంటూరుకు.. రూ.8.40 కోట్లు సీజ్