సీఎం కేసీఆర్ సార్ సల్లగుండాలె
ఊరురా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం
లాగోడికి డోకా లేదని అన్నదాతల సంబురం
రెండో రోజూ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ
సిద్దిపేట, డిసెంబర్ 29 : రైతుబంధు సంబురం కొనసాగుతున్నది. రెండో రోజూ బుధవారం అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ అయ్యింది. ‘ఎవుసం చేయాలంటే సావుకారి దగ్గరికెళ్లి అప్పు తీసుకుని లాగోడికి పెట్టుబడులు పెట్టేవాళ్లం.. సీఎం కేసీఆర్ వచ్చాక లాగోడికి ఇబ్బంది లేదు. ‘గిట్ల ఎవ్వలివ్వలె.. ఏ సర్కారు ఇయ్యలే.. ఇయ్యాల కేసీఆర్ సార్ సమయానికి పైసలిత్తుండు. వీటిని సక్కగా వాడుకుంటున్నాం. ఇత్తులు, ఎరువులు కొనుక్కుంటం.. ఇప్పడు ఇచ్చేదానితో ఎనిమిది కార్లకు సా యం అందింది. సీఎం కేసీఆర్ సార్ సల్లంగ ఉండాలి..’ అని గ్రామాల్లో బుధవారం సీఎం కేసీఆర్ చిత్ర పటాలకు రైతులు క్షీరాభిషేకాలు నిర్వహించారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో అన్ని మండల, నియోజకవర్గ కేంద్రాలతో పాటు గ్రామాల్లో రైతులు సంబురాలు చేసుకున్నారు. గజ్వేల్ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మెదక్లో పద్మాదేవేందర్రెడ్డి, జహీరాబాద్లో మాణిక్రావు, సంగారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జడ్పీచైర్మన్లు, రైతుబంధు సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, రైతు సంఘాలు, రైతులు పాల్లొన్నా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల మేరకు యాసంగిలో సాగు పెట్టుబడుల నిమి త్తం ఎకరాకు రూ. 5వేల చొప్పున రెండు రోజులుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయన్నారు. తొలిరోజు ఎకరం భూమి ఉన్న రైతులకు జమ కాగా, రెండోరోజు రెండెకరాలలోపు వారికి డబ్బులు జమ చేశామని తెలిపారు. వారం పది రోజుల్లో అర్హులైన రైతులందరికీ డబ్బులు అందుతాయన్నారు. రైతు బంధు సాయా న్ని కొంతమంది వ్యవసాయ బావులకు, మరికొంత మంది సాగు కోసం, వ్యవసాయ పరికరాల కొనుగోలుకు ఇలా వివిధ రకాలుగా వినియోగించుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి సకల వసతులను కల్పిస్తుండడంతో రైతులు సాగును సంబురంగా చేసుకుంటున్నారని, పుష్కలంగా నీరు అందివ్వడంతో ప్రతి గుంట సాగులోకి వచ్చిందన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుంటే ఇది గిట్టని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అనవసరంగా రాజకీయాలు చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పలువురు రైతులు మాట్లాడుతూ రైతులు అడగకముందే రైతు బంధు ఇచ్చిన సీఎం కేసీఆర్ను అభినందించాల్సింది పోయి విమర్శలు చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు బుద్ధి చెబుతామని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం వానకాలం ధాన్యం చివరిగింజ వరకు కొనుగోలు చేసిన విషయాన్ని రైతులు గుర్తు చేస్తున్నారు.
రెండు రోజుల్లో 5,20,425 మంది రైతులకు రూ.245.76 కోట్లు
ప్రభుత్వం రెండోరోజూ ఉమ్మడి మెదక్ జిల్లాలోని 2,40,387 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.168,44,31,775 జమ చేసింది. సిద్దిపేట జిల్లాలో 84,030 మంది రైతులకు గాను రూ.59,69,71,806, మెదక్ జిల్లాలో67,929 మందికి రూ.46,14,36,443, సంగారెడ్డి జిల్లాలో 88,428 మందికి రూ.62,60,23,526 ప్రభు త్వం రైతుబంధు డబ్బులను వేసింది. ఈ రెండు రోజుల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో 5,20,425 మందికి రూ.రూ.245,76,69,042 వేశారు.
సీఎం కేసీఆర్కు రుణపడి ఉండాలి
జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు
జహీరాబాద్, డిసెంబర్ 29 : అన్నదాతలు అప్పులు తీసుకోకుండా పంటలు సాగు చేసుకునేందుకు ప్రభుత్వం ప్రతి ఏడాది ఎకరాకు రూ.10 వేలు పంట పెట్టుబడి కోసం ఇస్తుందని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అన్నారు. బుధవారం జహీరాబాద్ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదో విడుత రైతుబంధు డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నదన్నారు. యాసంగి వ్యవసాయ పనులు ప్రారంభం కావడంతో సీఎం కేసీఆర్ పెట్టుబడి కోసం డబ్బులు వేశారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి రైతులు రుణపడి ఉండాలన్నారు. జహీరాబాద్ పట్టణ, మండల అధ్యక్షులు మొయినోద్దీన్, ఎంజీ.రాములు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
సేట్ల దగ్గరికి అప్పుకు పోతలే..
గతంలో పంట వేయాలంటే 15 రోజుల ముందే ఊరిలో బాగా పైసలున్న సేట్ల దగ్గరికి అప్పు కోసం పోయేవాళ్లం. రైతుబంధు ద్వారా పైసలు వస్తుండడంతో ఈ నాలుగు ఏండ్ల నుంచి సేట్ల దగ్గరికి పోవడమే బంజేషినా. ఇప్పుడు నా ఖాతాకే రైతుబంధు పైసలు వస్తున్నయ్. దర్జాగా బ్యాంక్కు పోయి పైసలు తెచ్చుకున్నా. రైతుల సంతోషం కోసమే సీఎం కేసీఆర్ ఇటువంటి పథకాలను ప్రవేశపెడుతున్నాడు.
-మ్యాకల ఎల్లం, రైతు, నిజాంపేట, మెదక్ జిల్లా
సార్కు అన్నదాతల దీవెనలు
నాకు 28 గుంటల భూమి ఉంది. రైతు బంధు కింద రూ. 3,550 వచ్చింది. నాకు సాయం అందడం ఇది ఐదో సారి. చిన్న, పెద్ద రైతులందరికీ పెట్టుబడి సాయం కింద రైతు బంధు ఇస్తున్న కేసిఆర్ సారు బాగుండాలి. రైతుల మంచి కోరుకునే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. రైతన్నల దీవెనలు ఎప్పుడూ కేసిఆర్ సార్ కి ఉంటాయి.
-గూగ్లోత్ దేవేందర్, శిబ్బి తండా, ధూళిమిట్ట మండలం
అప్పుల బాధ తప్పింది..
రైతుబంధు పథకం రైతులకు వరం. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల గోస తీర్చిండు. పెట్టుబడి సాయం అందుతున్నప్పటి నుంచి అన్నదాతలు ధైర్యంగా బతుకుతుండ్రు. ఏడాదికి రెండు సార్లు ఎకరానికి రూ.5 వేలు ఇస్తుండు. గతంలో పైసలు అక్కర పడితే వేరే వాళ్లను బదులు అడుక్కోవలసి వచ్చేది. ఇప్పుడా ఇబ్బంది లేదు. అకౌంట్లనే డబ్బులు పడ్తున్నయి. రైతుబంధు పథకం పెట్టి రైతులకు కేసీఆర్ రంది లేకుండ చేసిండు. నిన్న నా అకౌండ్ల ఐదు వేలు పడ్డయి.
-గుర్రాల మహేందర్ రెడ్డి, కోహెడ
పెట్టుబడి అందింది
సీఎం కేసీఆర్ అందిస్తున్న రైతు బంధు పైసలు అందినయి. నాకున్న ఎకరం పొలానికి రూ. 5వేలు ఖాతాలో పడ్డయి. ఈ పైసలను ఎరువులు, యూరియా కొనేందుకు వాడుకుంటా. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇట్ల రైతులకు పంటసాయం కోసం డబ్బులు ఇయ్యలే. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి. రైతుల కష్టాలు తెలిసినోడు కాబట్టే ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆదుకుంటున్నడు. రైతులందరూ కేసీఆర్, ప్రభుత్వానికి రుణపడి ఉంటరు.
-పుట్ట శ్రీశైలం, మీర్జాపూర్, హుస్నాబాద్ మండలం
ప్రాజెక్టులతో బావులు నిండుతున్నయ్
రైతుల కష్టాలను తీర్చి సీఎం కేసీఆర్ పెద్దదిక్కైండు. కేసీఆర్సార్ రాక ముందు ఎవుసమే దండుగ అన్నరు. ఇప్పుడు ఎవుసం ఓ పండుగైంది. ఎందుకంటే టైంకు రైతులకు పెట్టుబడి వస్తుంది. అంతేకాకుండా రైతు చనిపోతే ఆ కుటుంబానికి రూ.ఐదు లక్షలు బీమా డబ్బులు ఇస్తుండు. ఇంతకుముందు ఎవలైనా ఇట్ల ఇచ్చిండ్రా. 24గంటల కరెంట్ రావట్టె, ప్రాజెక్టులతో బావుల నిండా నీళ్లు ఉండవట్టె.. రైతులకు ఇంకేం కావలి.
-నల్ల బాల్రెడ్డి, రైతు రేబర్తి, మద్దూరు మండలం