వరంగల్ : తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ నేతృత్వంలో గ్రామీణ రోడ్లకు మహర్దశ పట్టిందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాయపర్తి మండలం పెరికేడు గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాల్లో అద్భుతంగా రోడ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామంలో రోడ్లు, గ్రామాల మధ్య లింకు రోడ్లు రావడంతో గ్రామాల రూపురేఖలు మారిపోయాయని తెలిపారు.
బాగున్నాయి. రోడ్లను నాణ్యతతో నిర్మించి నిర్ణీత సమయంలో పూర్తి చేసి బిల్లులు పొందాలన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.