యాదాద్రి, మార్చి 7 : యాదాద్రి అనుబంధాలయమైన పర్వతవర్ధనీసమేత రామలింగేశ్వరాలయంలో అర్చకులు, పురోహితులు సోమవారం పరమశివుడికి రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. శివాలయం ప్రధాన పురోహితులు ఆధ్వర్యంలో విశేష పుష్పాలంకరణ జరిపారు. సత్యనారాయణ వ్రతాల్లో భక్తులు పాల్గొని సామూహిక వ్రతమాచరించారు.యాదాద్రిలో స్వామివారి దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరా ంటకంగా కొనసాగాయి. దీంతో ఆలయ పరిసర ప్రాంతాల్లో భక్తులు సందడి నెలకొంది. అన్ని విభాగాలతో కలిపి స్వామివారికి రూ. 16, 59,711 సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్. గీత తెలిపారు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారిని గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. యాదాద్రికి చేరుకున్న గవర్నర్ ముందుగా ప్రారంభానికి సిద్ధంగా ఉన్న నూతనాలయాన్ని పరిశీలించారు. అనంతరం బాలాలయంలో స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చక బృందం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి బాలాలయ ముఖ మండపంలో అర్చకులు చతుర్వేద ఆశీర్వచనం అందజేయగా, ఆలయ ఈవో ఎన్.గీత ప్రత్యేకంగా తయారు చేసిన స్వామివారి లడ్డూను అందజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు సుఖ సంతోషాలతో జీవించాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. యాదాద్రి ఆలయాన్ని ప్రభుత్వం అద్భుతంగా పునర్నిర్మించారని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, డీసీపీ నారాయణరెడ్డి, ఆర్డీఓ భూపాల్రెడ్డి, ఆలయ ఈఓ ఎన్. గీత, ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, ఏసీపీ నర్సింహారెడ్డి, సీఐ జానకీరెడ్డి, తాసీల్దార్ రాము, ఏఈఓలు గజవెల్లి రమేశ్బాబు, శ్రవణ్కుమార్ పాల్గొన్నారు.
ప్రధాన బుకింగ్ ద్వారా 1,06,550
రూ.100 దర్శనం 16,000
వీఐపీ దర్శనాలు 60,000
వేద ఆశీర్వచనం 3000
సుప్రభాతం 300
క్యారీ బ్యాగుల విక్రయం 8,400
వ్రత పూజలు 73,600
కళ్యాణ కట్ట టిక్కెట్లు 24,000
ప్రసాద విక్రయం 5,96,940
వాహన పూజలు 15,100
టోల్గేట్ 680
అన్నదాన విరాళం 5,30,001
సువర్ణ పుష్పార్చన 1,06,000
యాదరుషి నిలయం 63,940
పాతగుట్ట నుంచి 42,440
లీసెస్, లీగల్ 2,360
గోపూజ 400