న్యూఢిల్లీ : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అగ్ర నాయకత్వం గురువారం సమావేశం కానున్నది. దేశంలో కొనసాగుతున్న కొవిడ్ పరిస్థితులతో పాటు పశ్చిమ బెంగాల్ ఎన్నికల అనంతరం నెలకొన్న హింసపై చర్చించనున్నట్లు తెలుసున్నది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్తో పాటు ముఖ్యనేతలు సమావేశానికి హాజరుకానున్నారు. ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే ఇటీవల ఆర్ఎస్ఎస్ ఉత్తరప్రదేశ్ సంఘ్ కార్యకర్తలను కలిసి తర్వాత సమావేశం జరుగుతుండడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
భగవత్జీ, దత్తాజీతో పాటు సురేష్ భయ్యాజీ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా దేశం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలుపై చర్చలు జరుపుతారని ఆర్ఎస్ఎస్ వర్గాలు తెలిపాయి. కొవిడ్ ప్రభావం, ఆర్థిక వ్యవస్థ, సంఘ్ కార్యకర్తలు చేపట్టిన సంక్షేమ, సహాయక చర్యలు, మూడో వేవ్ను ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన సన్నాహాలపై చర్చ జరుగుతుందని చెప్పాయి. అలాగే పశ్చిమ బెంగాల్లో ఎన్నికల అనంతరం జరుగుతున్న హింస, ముఖ్యంగా రాజకీయంగా, సైద్ధాంతికంగా కీలకమైన ఉత్తరప్రదేశ్లో పరిస్థితులపై సైతం చర్చించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.