ముంబై : బాలీవుడ్ లవ్ బర్డ్స్ టైగర్ ష్రాఫ్, దిషా పటానీపై ముంబైలో పోలీసులు ఎఫ్ఆర్ఐ రిజిస్టర్ చేశారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు చర్యలు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నటీనటులిద్దరూ ఇద్దరూ సరైన కారణం లేకుండా బయటకు వచ్చారు. మంగళవారం సాయంత్రం బాంద్రా బ్యాండ్ స్టాండ్ వద్ద పెట్రోలింగ్లో డ్యూటీలో ఉన్న ఇద్దరిని పోలీసులు ఆపారు. టైగర్ ష్రాఫ్ బాంద్రా (వెస్ట్) నివాసిగా అని పోలీసులు పేర్కొన్నారు. ఇద్దరినీ విచారించిన తర్వాత వారు డ్రైవ్ కోసం బయటకు వచ్చారని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు సరైన కారణం లేకుండా బయటకు వచ్చి లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్నందుకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం ఇద్దరిపై బుధవారం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినట్లు ముంబై సీనియర్ పోలీస్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ముంబై పోలీసులు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించినపై వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఏప్రిల్ 5 నుంచి జూన్ 1వ తేదీ మధ్య లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 20వేల మందిపై ఇప్పటి వరకు 19,963 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఇందులో మెజారిటీ కేసులు 6,664 ఎలాంటి కారణం లేకుండా బయట తిరుగుతున్న వారిపై నమోదు చేయగా, 4,602 మాస్క్లు ధరించనందుకు.. మిగతా వాటిని ఇబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు, వాహనాలు బయటకు తీసుకువచ్చినందుకు కేసులు నమోదయ్యాయని అధికారులు చెప్పారు.