న్యూఢిల్లీ, మార్చి 31: దేశంలో ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా లీటరు పెట్రోల్పై 90 పైసలు, డీజిల్పై 87 పైసలు పెరిగింది. పెట్రో రేట్లు పెరుగడం ఇత పది రోజుల్లో ఇది తొమ్మిదోసారి. మొత్తంగా లీటర్ పెట్రోల్పై రూ.7.22, లీటర్ డీజిల్పై రూ.6.96 చొప్పున ధరలు పెరిగాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.115.42, డీజిల్ రూ.101.58గా ఉంది.
హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): ఇంధన ధరల పెంపును నిరసిస్తూ ఈ నెల 4 నుంచి 10 వరకు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్టు సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా చెప్పారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ అమ్ముడుపోయే పద్ధతిలో పనిచేస్తున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. దేశంలోని విలువైన ఆస్తులను అదానీకి అప్పగించే ప్రయత్నంలో జీవీకేకు అన్యాయం చేశారని ఆరోపించారు. బాంబే ఎయిర్పోర్టును జీవీకే సంస్థ నిర్మిస్తే.. అప్పుల పేరుతో మెడ మీద కత్తిపెట్టి లాక్కున్నారని అన్నారు.
కర్నాల్, మార్చి 31: పెట్రోల్ ధరల పెంపుపై అభిప్రాయం ఏంటని అడిగిన రిపోర్టర్పై యోగా గురువు రాందేవ్ బాబా విరుచుకుపడ్డారు. ‘నోర్మూసుకో.. ఇంకోసారి అడిగితే మంచిగుండది. సత్ప్రవర్తన కలిగిన తల్లిదండ్రులకే పుట్టినవ్ అనుకొంటున్నా.. ఇలా మాట్లాడకు’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘పెట్రోల్ రేటు రూ.40, వంట గ్యాస్ ధర రూ.300 చేస్తా అన్న పార్టీకే ఓటేయండి’అంటూ రాందేవ్ గతంలో బీజేపీ కోసం ప్రచారం చేశారు. ఈ వ్యాఖ్యలపై హర్యానాలో ఓ రిపోర్టర్ రాందేవ్ను ప్రశ్నించగా.. ఆయన పైవిధంగా విరుచుకుపడ్డారు.