ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత మొదలైన ఇంధన ధరల పెంపు సోమవారం కూడా కొనసాగింది. ఆయిల్ కంపెనీలు తాజాగా లీటర్ పెట్రోల్పై 45 పైసలు, డీజిల్పై 43 పైసల చొప్పున పెంచేశాయి. గత రెండు వారాల వ్యవధిలో రెండు రోజులు మినహా పెట్రో ధరలు పెరుగడం ఇది పన్నెండోసారి.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత మొదలైన ఇంధన ధరల పెంపు సోమవారం కూడా కొనసాగింది. ఆయిల్ కంపెనీలు తాజాగా లీటర్ పెట్రోల్పై 45 పైసలు, డీజిల్పై 43 పైసల చొప్పున పెంచేశాయి. గత రెండు వారాల వ్యవధిలో రెండు రోజులు మినహా పెట్రో ధరలు పెరుగడం ఇది పన్నెండోసారి. మొత్తంగా లీటర్ పెట్రోల్పై రూ.9.48, డీజిల్పై రూ.9.13 పెరిగింది. హైదరాబాద్లో పెట్రోల్ ధర రూ.117.68, డీజిల్ 103.75కి చేరింది.
ఇంధన ధరలపై పార్లమెంట్ ఉభయసభలు అట్టుడికాయి. లోక్సభలో కాంగ్రెస్, టీఎంసీ, శివసేనతో పాటు పలు ప్రతిపక్ష పార్టీల సభ్యులు వెల్లోకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ధరల పెంపునకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు. రాజ్యసభలో కూడా ఇదే సీన్ కనిపించింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు చేపట్టిన ఆందోళనతో సభ మంగళవారానికి వాయిదా పడింది.
‘ఎనిమిదేండ్ల పాలనా కాలంలో కేంద్రంలోని మోదీ సర్కార్ ఇంధన పన్నుల రూపంలో రూ.26,51,919 కోట్లు రాబట్టింది. మన దేశంలో దాదాపు 26 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. అంటే ప్రతి కుటుంబం నుంచి కేంద్రం సగటున రూ.లక్ష వసూలు చేసిందన్న మాట’
-మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం
‘బీజేపీయేతర రాష్ర్టాల్లో ఆ పార్టీ చేస్తున్న దౌర్జన్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు పెట్రో ధరల పెంపునకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ధరలను తగ్గించే ఆలోచనలో మోదీ సర్కార్ లేదు. యూపీలో గెలిచిన తర్వాత ప్రజలకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇది. ప్రతిపక్ష పార్టీలపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పడానికి బదులుగా.. ప్రస్తుత ఆర్థిక సమస్యల పరిష్కారంపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి’
– పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ
‘నిత్యం ధరల పెంపు ప్రజల ధనాన్ని లూటీ చేయడమే. ఇది ప్రధాన మంత్రి జన్ధన్ ‘లూట్’ యోజన. 2014తో పోలిస్తే పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. అప్పట్లో బైక్ ఫుల్ట్యాంక్ పెట్రోల్కి రూ.714 అయితే, ఇప్పడు రూ.1,038 చెల్లించాల్సి వస్తుంది. రూ.2,749గా ఉన్న ట్రాక్టర్ ఫుల్ట్యాంక్ డీజిల్.. రూ.4,563కి చేరింది’
-కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ
హైదరాబాద్లో శనివారం ధర పెంపు తాజా ధర
పెట్రోల్ రూ.117.23 45 పైసలు రూ.117.68
డీజిల్ రూ.103.32 43 పైసలు రూ.103.75