IND vs ENG 3rd Test : ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో భారత కెప్టెన్ రోహిత్ శర్మ(97 నాటౌట్) సెంచరీకి చేరువయ్యాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన హిట్మ్యాన్ జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. మరో ఎండ్లో క్రీజులో పాతుకుపోయిన రవీంద్ర జడేజా(68 నాటౌట్) అర్ధ సెంచరీ బాదాడు. లంచ్ తర్వాత బంతి ఎక్కువగా టర్న్ కాకపోవడంతో ఇద్దరూ దూకుడుగా ఆడారు.
రోహిత్, జడేజా నాలుగో వికెట్కు 152 పరుగులు జోడించారు. విశేషం ఏంటంటే.. ఈ సిరీస్లో ఒక సెషన్లో భారత జట్టు ఒక్క వికెట్ కూడా కోల్పోకపోవడం ఇదే మొదటిసారి. జడేజా, రోహిత్ జోరుతో టీమిండియా టీ బ్రేక్ సమయానికి మూడు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది.
The first wicketless session of the series #INDvENG
▶️ https://t.co/uNRzS8Vrgx pic.twitter.com/gYF7XQvBPM
— ESPNcricinfo (@ESPNcricinfo) February 15, 2024
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న భారత్ ఒకదశలో 33 పరగులకే 3 వికెట్లు కోల్పోయింది.మార్క్వుడ్, హర్ట్లే విజృంభణతో యశస్వీ జైస్వాల్(10), శుభ్మన్ గిల్(0), రజత్ పాటిదార్(5)లు స్వల్ప స్కోర్కే వెనుదిరిగారు. దాంతో, ఇక రోహిత్ సేన 150 లోపే ఆలౌటవ్వడం పక్కా అనిపించింది. కానీ, అరంగేట్రం కుర్రాళ్లు సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జెరెల్ కంటే జడేజాను ముందు పంపడం భారత్కు కలిసొచ్చింద.