IND vs ENG 3rd Test : మూడో టెస్టులో రోహిత్ శర్మ(52 నాటౌట్ : 74 బంతుల్లో 8 ఫోర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్తో జట్టును ఆదుకున్నాడు. ఒత్తిడిలోనూ క్రీజులో పాతుకుపోయి హాఫ్ సెంచరీ బాదాడు. ఇంగ్లండ్ పేసర్లు మార్క్ వుడ్, జేమ్స్ అండర్సన్ నిప్పులు చెరుగుతున్నా.. పట్టుదలగా క్రీజులో నిలబడి హాఫ్ సెంచరీ సాధించాడు.
టామ్ హర్ట్లే బౌలింగ్లో రెండు పరుగులు తీసిన హిట్మ్యాన్ కెరీర్లో 17వ అర్ధ శతకం నమోదు చేశాడు. నాలుగో వికెట్కు రవీంద్ర జడేజా(24 నాటౌట్) కలిసి 60 పరుగులు జోడించాడు. దాంతో, టీమిండియా లంచ్ సమయానికి మూడు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది.
That’s Lunch on Day 1 of the third #INDvENG Test!
An unbeaten 6⃣0⃣-run stand between captain @ImRo45 & @imjadeja! 🤝
We will be back for the Second Session shortly! ⌛️
Scorecard ▶️ https://t.co/FM0hVG5pje#TeamIndia | @IDFCFIRSTBank pic.twitter.com/EW1kfG55HN
— BCCI (@BCCI) February 15, 2024
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న భారత్కు ఆదిలోనే షాక్ తగిలింది. వైజాగ్ టెస్టులో డుబ్ సెంచరీతో మెరిసిన ఓపెనర్ యశస్వీ జైస్వాల్(10)ను మార్క్ వుడ్ ఔట్ చేశాడు. స్లిప్లో జో రూట్ చక్కని క్యాచ్ పట్టడంతో యశస్వీ డగౌట్కు చేరాడు. ఆ తర్వాత మరో సూపర్ డెలివరీ వేసిన వుడ్.. శుభ్మన్ గిల్(0)ను డకౌట్గా పెవిలియన్ పంపాడు. వైజాగ్ టెస్టులో ఆకట్టుకున్న రజత్ పాటిదార్(5)ను టామ్ హర్ట్లే ఔట్ చేసి టీమిండియాను మరింత కష్టాల్లోకి నెట్టాడు.
రోహిత్ శర్మ(52 నాటౌట్)