అమరావతి : తూర్పుగోదావరి జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దాపురం ఏడీబీ రహదారి పారిశ్రామిక ప్రాంతం వద్ద లారీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదు నెలల చిన్నారి సహా నలుగురు దుర్మరణం చెందారు. కారులో ఉన్న వ్యక్తులు తాళ్లరేవు మండలం పెద్దవలస నుంచి రాజమహేంద్రవరం వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కారులో చిక్కుకున్న మరో ఐదుగురిని పోలీసులు రక్షించి ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. అయితే, మృతులకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు.