వీణవంక : అణగారిన వర్గాల ఆర్థికాభివద్ది కోసం సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం తీసుకువచ్చి అకౌంట్లల్ల రూ.10 లక్షలు వేస్తే చేతికి అందే సమయానికి బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి ప్రేమేందర్రెడ్డి దళిత బంధు పథకాన్ని ఆపాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసి నోటికాడి కూడు తీసిన బీజేపీ పార్టీని ఓట్లు అడగడానికి ఇళ్ళల్లోకి వస్తే తరమి కొట్టా లని దళిత జాతికి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో ఆయన విలేకరులతో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ బీజేపీ పార్టీ కుట్రలు, కుతంత్రాలతో, అబద్దపు పునాదులతో హుజూరాబాద్ ఎన్నికల్లో గెలవాలని అనేక ప్రయత్నాలు చేస్తుందన్నారు. దళిత సాధికారత పేరుతో సీఎం కేసీఆర్ అసెంబ్లీ లో తీర్మానం చేసి, అమలు చేస్తుంటే ఎన్నికల కోసమేనని ఈటల అబద్దపు ప్రచారాలు చేస్తున్నాడని అన్నారు. టీఆర్ ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ ఒక్కసారి మాటిస్తే అది అమలయ్యే దాక నిద్రపోడని, ఈ పథకం తాత్కాలికంగా ఆగిపోవచ్చు కానీ మరలా 12 రోజుల తర్వాత అమలు చేయడం జరుగుతుందని అన్నారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలోని 17 వేల కుటుంబాలకు డబ్బులు ఖాతాలో జమ అయ్యాయని, కొందరు హర్యానా వెళ్ళి గేదెలు తీసుకువచ్చే పనిలో ఉన్నారని, మరి కొందరివి గ్రౌడింగ్ అవుతున్నాయని తెలిపారు. చేతనైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న రూ.10 లక్షలకు అదనంగా మరో రూ.10 లక్షలు ఇచ్చి చిత్తశుద్ది నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లయితే ముక్కు నేలకు రాస్తానని ఈటల రాజేందర్ అన్నారని, ఈ రోజు నీ పార్టీ వారే లేఖ రాయడం జరిగిందని దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ పథకం ఆపడం వల్ల ఈటల రాజేందర్ లబ్ది పొందాలని చూస్తున్నారని, దళితుల ఆగ్రహానికి గురికాక తప్పదని తెలి పారు. ఇప్పటికే ప్రారంభమయి జరుగుతున్న కార్యక్రమాన్ని ఎలా ఆపారో కేంద్ర ఎన్నికల సంఘం వివరణ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచిన పార్టీ, మోటార్లకు మీటర్లు బిగించిన పార్టీ బీజేపీ పార్టని అన్నారు. కటికదారిద్య్రాన్ని అనుభవిస్తున్న దళితుల కోసం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని ఏ విధంగా ఆపారో సమాధానం చెప్పాలని, అన్ని వర్గాల ప్రజలకు వ్యతిరేఖంగా పని చేస్తున్న ఈటల రాజేందర్ కు తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు.
బీజేపీకి ఓటు వెయ్యడం అంటే ధరలు పెంచిన, మోటార్లకు మీటర్లు బిగించిన, దళిత వ్యతిరేఖ పార్టీకి ఓటు వేయ డమంటే దాన్ని సమర్థించినట్లేనని పేర్కొన్నారు.బీజేపీ మనిషి ఈటల రాజేందర్కు ఓటు వేయకుండా టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి సరైన తీర్పు ఇవ్వాలని సూచించారు.తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమం, అభివద్దే ధ్యేయంగా పని చేస్తున్న టీఆర్ ఎస్ పార్టీకి ఓటు వేసి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.