ఖమ్మం : నగర వ్యవసాయ మార్కెట్లో తిరిగి ఎర్రబంగారం (తేజా రకం ఏసీ మిర్చి ) ధరలు పెరుగుతున్నాయి. ఈ సంవత్సరం ఆరంభంలో ఆశించిన మేర ధర పలికినప్పటికీ గడిచిన సంవత్సరంలో క్వింటా ధర రూ22వేల వరకుపలికింది. అయితే వారం రోజుల క్రితం ఏసీ రకం పంట క్వింటాల్ గరిష్ట ధర కేవలం రూ12,300 మాత్రమే పలికింది. దీంతో మరింత తగ్గే అవకాశం ఉందని గ్రహించిన రైతులు తప్పని పరిస్థితుల్లోపంటను అమ్ముకున్నారు.
కోల్డ్ స్టోరేజీలలో ప్రస్తుతం10శాతం పంట మాత్రమే ఉండటంతో తిరిగి అదే పంటకు ధరలు పెరుగతున్నాయి. అంచెలంచులుగా పెరుగుతూ గురువారం ఉదయం జరిగిన జెండాపాటలో క్వింటా రూ.13,500 పలికింది. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే క్వింటాధర రూ.వెయ్యి వరకు పెరగింది. నిన్నా మొన్నటి వరకు పత్తి క్వింటా గరిష్ట ధర రూ. 8,500 వరకు పలుకగా, ఉదయం జరిగిన ఆన్లైన్ బిడ్డింగ్లో క్వింటా గరిష్ట ధర రూ. 7,750కు పడిపోయింది.