ప్రస్తుతం తెలుగుతోపాటు హిందీలో కూడా బిజీగా హీరోయిన్లలో ఒకరు రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh). ఈ బ్యూటీ గ్లామరస్ పాత్రలు చేస్తూనే..నటనకు ఆస్కారమున్న సినిమాల్లో నటిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ భామ ఇప్పటివరకు దాదాపు తన కంటే పెద్ద వయస్సున్న హీరోలతో సిల్వర్ స్క్రీన్ పై మెరిసింది. కానీ తాజాగా యువ హీరో వైష్ణవ్ తేజ్ (Vaisshnav Tej) తో కలిసి కొండపొలం (Kondapolam) సినిమాలో నటిస్తోంది.
తన కంటే చిన్నవాడితో (వయస్సులో) పనిచేయడం గురించి ప్రశ్నించగా రకుల్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఇండస్ట్రీ పూర్తిగా మారిపోయిందని అనుకుంటున్నా. జూనియర్ యాక్టర్లతో పనిచేయొద్దు.. సీనియర్ యాక్టర్లతో మాత్రమే పనిచేయాలన్న రోజులు పోయాయి. కేవలం నువ్వు ఎలాంటి పాత్రలు ఎంపిక చేసుకుంటున్నావ్..ఎలాంటి రోల్స్ లో కనిపిస్తున్నావ్..వాటికి ఏవిధంగా న్యాయం చేస్తున్నావనేదే ముఖ్యమని చెప్పుకొచ్చింది. కొండపొలం సినిమాలో తన పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని చెప్పింది.
మరి కొండపొలం చిత్రంలో గ్రామీణ యువతిగా రకుల్ ఎలాంటి యాక్టింగ్ చేసిందో తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం రకుల్ హిందీలో నటిస్తోన్న అటాక్, మేడే చిత్రాలతోపాటు మరో రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. తమిళంలో రెండు సినిమాలు చేస్తోంది.
ఇవికూడా చదవండి..
Bangarraju : బంగార్రాజు ఫస్ట్ లుక్ విడుదల చేసిన నాగ చైతన్య
Bigg Boss: పుకార్లకి ఈ పోస్టర్తో చెక్ పడ్డట్టేనా ?
Chiranjeevi| చిరంజీవిని కలిసేందుకు 12 రోజులు సైకిల్ యాత్ర