భోపాల్ : కులగణన చేపట్టాల్సిన ఆవశ్యకతను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) నొక్కిచెప్పారు.మధ్యప్రదేశ్లోని షహ్దోల్లో మంగళవారం జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ కులగణన మైనారిటీ వర్గాలకు సంబంధించి సత్యాలను వెల్లడించే ఎక్స్రే వంటిదని రాహుల్ అభివర్ణించారు. కులగణన చేపట్టాలని తాము కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామని అన్నారు.
మధ్యప్రదేశ్లో కులగణన నిర్వహించాలని సూచించిన కాంగ్రెస్ నేత ఇవాళ ఆదివాసీలకు ఎలాంటి హక్కులు కల్పిస్తున్నారని నిలదీశారు. ఓబీసీ, ఎస్టీ వర్గాలకు దక్కుతున్నది ఎంతని ప్రశ్నించారు. ఈ ప్రశ్న ఇవాళ దేశం ముందుతున్నదని, అందుకే తాము కులగణన గురించి మాట్లాడుతున్నామని చెప్పారు. ఎలాగైనా కులగణన జరిగేలా చూస్తామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
కాషాయ పార్టీ పాలనలో మధ్యప్రదేశ్లో ప్రతిరోజూ ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాపం కుంభకోణంలో కోటి మంది యువత భవిష్యత్ ఛిద్రమైందని అన్నారు. ఎంబీబీఎస్ సీట్లు అమ్ముకున్నారని దుయ్యబట్టారు. మధ్యప్రదేశ్లో గత 18 ఏండ్లలో 18000 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని అన్నారు.
Read More :
Shehnaaz Gill | ఆస్పత్రిలో చేరిన బాలీవుడ్ నటి షెహనాజ్ గిల్