Rahul Gandhi | న్యూఢిల్లీ, మార్చి 7: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి కేరళలోని వయనాడ్ నుంచి లోక్సభకు పోటీ చేయనున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని వివిధ రాష్ర్టాల లోక్సభ అభ్యర్థుల ఎంపిక, ఇతర విషయాలు చర్చించడానికి గురువారం పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ తొలిసారిగా సమావేశమైంది.
ఈ సమావేశంలో రాహుల్ గాంధీ సహా 40 మంది అభ్యర్థులను ఖరారు చేశారు. త్వరలోనే లిస్టును విడుదల చేస్తామని చెప్పారు. ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 11 రాష్ర్టాలకు చెందిన 60 మంది లోక్సభ అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. ఈ సమావేశంలో తెలంగాణ, కర్ణాటక, కేరళ తదితర రాష్ర్టాల అభ్యర్థుల గురించి చర్చ జరిగింది.