అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన క్రేజీ ప్రాజెక్ట్ పుష్ప. ఈ చిత్రం భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది. రెండు పార్ట్లుగా రూపొందిన ఈ చిత్రం తొలి పార్ట్ ‘పుష్ప ది రైజ్’ పేరుతో విడుదలైంది. వచ్చే ఏడాది సెకండ్ పార్ట్ రానుంది. సెకండ్ పార్ట్ ఏ పేరుతో విడుదల కానుంది అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, సుకుమార్ ఆ పేరు రివీల్ చేశారు.
పుష్ప ది రైజ్ మూవీ చివరిలో సెకండ్ పార్ట్కు ‘పుష్ప-ద రూల్’ టైటిల్ పెట్టినట్టు తెలియజేశాడు సుకుమార్. పుష్ప ది రైజ్తోనే మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న బన్నీ.. సెకండ్ పార్టులో తన రూలింగ్తో మరింత పీక్స్కు తీసుకువెళ్లనున్నాడు. ఈ చిత్రం ఎర్రచందనం స్మగ్గింగ్ నేపథ్యంలో తెరకెక్కిన నేపథ్యంలో మూవీ షూటింగ్ ఎక్కువ భాగం అడవుల్లో జరిగింది.
పుష్ప’ కోసం అడవుల్లో రోజూ 500 మందికి పైగా పనిచేవారట. ఇక ఈ సినిమాలో ఓ పాటను దాదాపు 1000మందితో చిత్రీకరించారు. సమంత ఇందులో స్పెషల్ సాంగ్ చేయడం విశేషం. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, రష్మిక గ్లామర్, అల్లు అర్జున్ మేనరిజం తొలి పార్ట్కి మంచి విజయం దక్కేలా చేసింది.