ముంబై : డ్రగ్స్, గోల్డ్ స్మగ్లింగ్తో చెలరేగుతున్న అక్రమార్కులు చివరకు నోరులేని జీవాలనూ విడిచిపెట్టడం లేదు. మహారాష్ట్రలోని రత్నగిరి తీరం నుంచి 3500 గొర్రెలు, మేకలను విదేశాలకు అక్రమంగా తరలిస్తున్న బోట్ను పుణే కస్టమ్స్ అధికారులు, కోస్ట్గార్డ్ సిబ్బందితో కలిసి స్వాధీనం చేసుకున్నారు.
Maharashtra | Pune Customs along with Indian Coast Guard foiled an attempt to illegally export 3500 livestock (Goats & Sheep) off Ratnagiri coast in guise of coastal cargo for supply to Gujarat. The livestock was being exported to Dubai from Vijaydurg Port, Maharashtra. Further… pic.twitter.com/oTMH0AteEa
— ANI (@ANI) April 24, 2023
గుజరాత్కు సరఫరా పేరుతో కోస్టల్ కార్గో కింద జీవాలను దుబాయ్కు స్మగ్లింగ్ చేస్తున్నట్టు గుర్తించారు. మహారాష్ట్రలోని విజయ్దుర్గ్ పోర్ట్ నుంచి ఈ కన్సైన్మెంట్ను దుబాయ్కు తీసుకువెళుతున్నారని అధికారులు తెలిపారు. జీవాలను స్వాధీనం చేసుకున్న అధికారులు వాటికి విముక్తి ప్రసాదించేందుకు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని అధికారులు తెలిపారు.
Read More