మునుగోడు, అక్టోబర్ 24 : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మునుగోడుకు బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు రానున్నారు. ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించనున్నారు. నియోజకవర్గం నుంచి పెద్దసంఖ్యలో పార్టీ శ్రేణులతోపాటు సంక్షేమ పథకాల లబ్ధిదారులు తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారు. సభ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతుండగా స్థానిక ఎమ్మెల్యే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వసతులు, పార్కింగ్ తదితర వాటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఈ నెల 26న మునుగోడులో హాజరు కానున్న ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభం కానున్న నేపథ్యంలో బుధవారం సాయంత్రానికి ఏర్పాట్లును పూర్తి చేయనున్నారు. విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మూడ్రోజులుగా ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి స్వయంగా సభ ఏర్పాట్లును పర్యవేక్షిస్తున్నారు.
సభాస్థలాన్ని సిద్ధం చేయడంతో పాటు వేదిక నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. సభకు విస్తృత ప్రచారం కల్పిస్తూ మండలాల వారీగా ఇన్చార్జిలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. సభకు హాజరయ్యే జనానికి కూడా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా సభకు వ చ్చే వాహనాలను సైతం ఎక్కడికక్కడే పార్కింగ్ చేసే విధంగా మునుగోడుకు మూడు వైపులా పార్కింగ్ స్థలాలను సిద్ధం చేశారు ఎటు వైపు వచ్చే వాహనాలు ఆ వైపే నిలిపి అక్కడి నుంచి ప్రజలకు సభాస్థలికి చేరుకునేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు
ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి మంగళవారం ఉదయం నుంచే మునుగోడులో ఉండి స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి సభ ఏర్పాట్లును పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆశ్వీరాద సభకు నియోజకవర్గం నుంచి భారీగా తరలిరావడానికి సిద్ధంగా ఉన్నారు. సీఎం కేసీఆర్ ఆశీర్వదించి ఉప ఎన్నికలో టికెట్ ఇచ్చి పంపుతే మీరు గెలిపించారు. దాంతో నాలుగేండ్లలో నిలిచిపోయిన అభివృద్థిని మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, జగదీశ్రెడ్డి సహకారంతో పది నెలలో నియోజకవర్గాన్ని సుమారు రూ.600 కోట్ల నిధులతో అభివృద్ధి చేసి చూపించాను. ఇప్పుడు జరిగే సాధారణ ఎన్నికల్లో మునుగోడు బీఆర్ఎస్ అభ్యర్థిగా మళ్లీ ఆశీర్వదించి టికెట్ ఇచ్చారు. మరలా ప్రజలు ఆశీర్వదిస్తే మునుగోడులో మిగిలిపోయిన పనులు కూడా పూర్తి చేస్తానన్నారు. ప్రజాఆశ్వీరాద సభకు పెద్ద సంఖ్యలో తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారని అందుకు అనుగుణంగా సభా ఏర్పాట్లుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎమ్మెల్యే వెంట రాష్ట్ర కల్లు గీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్, ఎంపీపీ కర్నాటి స్వామియాదవ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బండ పురుషోత్తంరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్వాయి గోవర్థన్రెడ్డి, బండారు వెంకన్న, ఐతగోని విజయ్కుమార్, పెరమాళ్ల ప్రణయ్ కుమార్, ప్రసాద్, కిరణ్, సభా ఏర్పాట్లు బృందాలు, అధికారులు ఆయన వెంట ఉన్నారు.