పారిస్: కరోనా వైరస్ మహమ్మారి ఇటీవలి కాలంలో మరింతగా విజృంభిస్తుండటంతో ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. పెరిగిన కేసులు మరోసారి ఆందోళనను పెంచుతున్నాయి. కొవిడ్-19 థర్డ్ వేవ్ దేశవ్యాప్తంగా పెరుగకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రకటించారు. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా తిరిగి లాక్డౌన్ విధిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
పాఠశాలలు మూతపడనున్నాయి. పాఠశాలలను కనీసం మూడు వారాలపాటు మూసివేయాలని సూచించారు. ‘కరోనా దృష్ట్యా, ఈ చర్యలు శనివారం సాయంత్రం నుంచి ప్రారంభమై నాలుగు వారాల పాటు కొనసాగుతాయి’ అని జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో మాక్రాన్ చెప్పారు. మూడు వారాలపాటు నర్సరీలు, ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలను మూసివేస్తున్నట్లు స్పష్టంచేశారు. ఇంకా దృఢమైన చర్యలు తీసుకోకపోతే కరోనాను అదుపు చేయడం కష్టమైన పని అని ఇమాన్యుయేల్ మాక్రాన్ దేశ ప్రజలతో అన్నారు.
టెలివిజన్లో ప్రసారం చేసిన సందేశంలో లాక్డౌన్ సమయంలో అవసరమైన వస్తువుల దుకాణాలను మాత్రమే తెరువడానికి అనుమతించనున్నారు. ఉద్యోగులు కార్యాలయాలకు బదులుగా ఇంటి నుంచి పని చేయాల్సి ఉంటుంది. ఈ కాలంలో బహిరంగ సభలపై పూర్తిగా నిషేధం విధించారు.
ఇంటెన్సివ్ కేర్లో 44 శాతం (కరోనా వైరస్) రోగులు 65 ఏండ్లలోపు వారని ప్రభుత్వం నివేదికలు చెప్తున్నాయి. ఏప్రిల్ మధ్య నుంచి 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సున్నవారికి టీకాలు వేసే అవకాశాలు ఉన్నాయి. మే 15 నుంచి 50 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్నవారికి టీకాలు వేయాలని అధికారులు నిర్ణయించినట్లుగా తెలుస్తున్నది. దేశవ్యాప్తంగా 18 ఏండ్ల వయసు పైబడిన ఫ్రెంచ్ వారందరికీ ఈ వేసవి చివరి నాటికి టీకాలు వేస్తామని ప్రభుత్వం వెల్లడించింది.
ప్రజాప్రతినిధుల పని తీరే ఓటేసేందుకు కొలమానం కావాలి: వెంకయ్యనాయుడు
మిలటరీ డెయిరీ ఫాంల మూసివేత.. 132 ఏండ్లు కొనసాగిన ఆర్మీ పాడి
ఆల్ ఫూల్స్ డే.. ఎందుకు..? ఎప్పుడు..? ఎలా..? చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..