Power Cut | కాంగ్రెస్ ప్రభుత్వంలో సాక్షాత్తూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికే పవర్ కట్ సెగ తగిలింది. భట్టి విక్రమార్క పాల్గొన్న ఓ మీటింగ్లోనే కరెంటు పోయింది. దీంతో దాదాపు 20 నిమిషాల పాటు ఆయన చీకట్లోనే ఉండాల్సి వచ్చింది.
సీపీఐ నేతలతో డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క శనివారం భేటీ అయ్యారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం ప్రారంభమైన కాసేపటికే ఆ ప్రాంతంలో కరెంటు పోయింది. అయితే కాసేపటికే కరెంటు వచ్చింది కానీ.. సీపీఐ కార్యాలయంలో మాత్రం పవర్ రాలేదు. దీంతో దాదాపు 20 నిమిషాల పాటు భట్టి విక్రమార్క చీకట్లోనే గడపాల్సి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు కోతలు నిత్యకృత్యంగా మారాయి. సాధారణ ప్రజలే కాదు.. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ఈ కరెంటు కోతలను ఎదుర్కొన్నారు. అధికారిక, పార్టీ కార్యక్రమాలు జరుగుతుండగా మధ్యలోనే కరెంటు పోయిన ఘటనలు ఇటీవల తరచూ బయటకు రావడం తెలిసిందే.
భట్టి విక్రమార్కకు పవర్ కట్ సెగ!
సీపీఐ నేతలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ
సీపీఐ ఆఫీసు పరిసరాల్లో పవర్ కట్
సీపీఐ కార్యాలయం చుట్టూ కరెంట్ వచ్చినా ఉప ముఖ్యమంత్రి ఉన్న సీపీఐ కార్యాలయంలో ఇంకా రాని పవర్.
దాదాపు 20 నిమిషాల పాటు చీకట్లోనే భట్టి విక్రమార్క. pic.twitter.com/SnUnKuKx0P
— Telugu Scribe (@TeluguScribe) April 20, 2024