న్యూఢిల్లీ : శనివారం సాయంత్రం జరిగిన యురోపియన్ సదస్సుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. యురోపియన్ కౌన్సల్ అధ్యక్షుడు చార్లెస్ మిచెల్ ప్రత్యేక ఆహ్వానం మేరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ పాల్గొన్నారు. మొత్తం 27 మంది ఈయూ సభ్యులు, దేశాధినేతలు, ఇతర పెద్దలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఇండో-యూరోపియన్ యూనియన్ నాయకుల సమావేశాన్ని పోర్చుగల్ ప్రధాని ఆంటోనియో కోస్టా నిర్వహించారు.
పోర్చుగల్ ప్రస్తుతం యూరోపియన్ యూనియన్ కౌన్సిల్కు అధ్యక్షత వహిస్తున్నది. భారత-ఈయూ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెలలో పోర్చుగల్ను సందర్శించాల్సి ఉన్నది. అయితే, కరోనా పరిస్థితులు మరింతగా దిగజారుతున్నందున వర్చువల్ సమావేశం ఏర్పాటు చేశారు. పెరుగుతున్న కరోనా వ్యాప్తి గురించి ఈ సమావేశంలో చర్చ జరిపారు. భారతదేశం-ఈయూ నాయకుల సమావేశం మొదటిసారి EU + 27 ఫార్మాట్లో జరుగుతున్నది. ఈ సందర్భంగా కరోనా వైరస్ కారణంగా చనిపోయిన వారికి ఆత్మశాంతి కలుగాలంటూ సంయుక్తంగా ప్రార్థన చేపట్టారు.
“ఈ అత్యంత సవాలు సమయంలో భారతదేశం వైపు యురోపియన్ యూనియన్ ఉంటుంది. మా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం గురించి చర్చిస్తాం. ఈయూ, ఇండియా కలిసి పనిచేయడం ద్వారా చాలా ఎక్కువ సాధించవచ్చు” అని యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు ఉర్సులా వాన్ డెర్ లేయన్ అన్నారు.
25 సార్లు ఎవరెస్ట్ ఎక్కాడు.. కొత్త రికార్డు నెలకొల్పాడు..
దేశంలోనే తొలి బ్రీత్ బ్యాంక్ ప్రారంభం.. ఎక్కడంటే..!
ఆర్టికల్ 370 తొలగింపు భారత్ అంతర్గత విషయం: మహమూద్ ఖురేషి
చేతులు కలుపనున్న అగ్రరాజ్యాలు.. పుతిన్కు బైడెన్ ఆహ్వానం
పాకిస్తాన్లో అసిస్టెంట్ కమిషనర్గా హిందూ యువతి
కరోనా వేళ ఖరీదవుతున్న ఆహారాలు
జూలై కల్లా ముగియనున్న కరోనా సెకండ్ వేవ్ : ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు
ఐరోపాలో ముగిసిన రెండో ప్రపంచ యుద్ధం.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..