కోల్కతా, ఏప్రిల్ 30: శ్రీ శారద మఠం, రామకృష్ణ శారద మిషన్ అధ్యక్షురాలు ప్రవ్రాజిక ఆనందప్రాణ మాతాజీ(98) మంగళవారం కోల్కతాలో కన్నుమూశారు. వృదా ్ధప్య సమస్యలతో బాధ పడుతున్న ఆమె ఇటీవలే దవాఖాన నుంచి డిశ్చార్చి అయ్యి శారదా మఠం ప్రధాన కార్యాలయంలో చికిత్స పొందుతున్నారు.
మాతాజీ మృతికి ప్రధాని మోదీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంతాపం తెలిపారు. ఆమె సేవలను వారిద్దరూ కొనియాడారు. గత ఏడాది జనవరి 14న మాతాజీ శ్రీ శారద మఠం, రామకృష్ణ శారద మిషన్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు.