Loksabha Elections 2024 : దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన 49 పార్లమెంట్ నియోజకవర్గాల్లో లోక్సభ ఎన్నికల ఐదో విడత పోలింగ్ ముగిసింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చిన ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఓటు వేశారు. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నుంచి షారుక్ ఖాన్, టైగర్ ష్రాఫ్, రణ్బీర్ కపూర్, అనన్యా పాండే సహా పలువురు సినీ సెలబ్రిటీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
#WATCH | Actor Tamannaah Bhatia casts her vote in Mumbai, she says, “Everyone is excited to vote. While I was travelling to the voting centre, I could see many people heading to their respective voting centres. It is our responsibility to cast our vote.” pic.twitter.com/2U03qi48Me
— ANI (@ANI) May 20, 2024
ఇక నటి తమన్నా భాటియా ముంబైలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఓటు వేసేందుకు ప్రతి ఒక్కరూ ఉత్సాహం చూపుతున్నారని, పోలింగ్ కేంద్రానికి తాను వచ్చే క్రమంలో పలువురు తమ పోలింగ్ కేంద్రాలకు వెళుతూ కనిపించారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవడం మన బాధ్యతని ఆమె పేర్కొన్నారు.
Read More :
KTR | పెళ్లి కాలేదంట కానీ.. పిల్లలు పుట్టిండ్రంటా.. రేవంత్ సర్కార్పై కేటీఆర్ విమర్శలు