Power Plant Accident : చెన్నైలోని ఎన్నూర్లో నిర్మాణదశలో ఉన్న థర్మల్ పవర్ ప్లాంట్ (Thermal Power Plant)లో జరిగిన ప్రమాదంలో 9 మంది మరణించడంపై ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను ఎంతో బాధించిందని పేర్కొన్న మోడీ బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ (Stalin) కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నష్టపరిహారం చెల్లిస్తామని తెలిపారు.
‘థర్మల్ ప్లాంట్ ప్రమాదం వార్త తెలిసి ఎంతో ఆవేదనకు గురయ్యాను. ఈ కష్ట సమయంలో నా ఆలోచనలన్నీ బాధిత కుటుంబాల గురించే ఉన్నాయి. గాయపడినవాళ్లు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ప్రధాన మంత్రి జాతీయ రిలీఫ్ ఫండ్ నుంచి మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడినవాళ్లకు రూ.50 వేలు నష్టపరిహారంగా చెల్లిస్తాం’ అని ప్రధాని కార్యాలయం ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది. తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్గ్రేషియాగా ఇస్తామని తెలిపారు. అంతేకాదు మృతదేహాలను వారి స్వగ్రామానికి చేరుస్తామని వెల్లడించారు.
Saddened by the mishap due to the collapse of a building in Chennai, Tamil Nadu. My thoughts are with the affected people and their families in this difficult hour. Praying for the speedy recovery of the injured.
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next…
— PMO India (@PMOIndia) September 30, 2025
థర్మల్ ప్లాంట్ ఆర్చ్ ఒక్కసారిగా కుప్పకూలడంతో అక్కడే పనిచేస్తున్న 9 మంది మరణించారు. మృతులంతా అస్సాంకు చెందినవాళ్లే. గాయపడిన వారిని 15 కిలోమీటర్ల దూరంలోని స్టాన్లే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం గురించి తెలియగానే భారత్ హెవీ ఎలక్ట్రానికల్స్ లిమిటెడ్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం వారంతాప్రమదానికి గల కారణాలను అన్వేషించే పనిలో నిమగ్నమయ్యారు.