పేదల సొంతింటి కల నెరవేరేలా రాష్ట్ర సర్కార్ చర్యలు తీసుకుంటున్నది. సొంత జాగ ఉన్న వారికి వచ్చే నెల నుంచే రూ.3లక్షల ఆర్థిక సాయాన్ని అందించాలని నిర్ణయించింది. ‘డబుల్’ ఇండ్లకు సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో భారీగా నిధులను కేటాయించారు. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లాకు రూ.900 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఈ నెలాఖరులోగా ఇండ్ల నిర్మాణాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికతో పాటు తదితర విధివిధానాలను అధికారులు తయారు చేయనున్నారు. బడ్జెట్ సమావేశాలు పూర్తైన వెంటనే నిధులు విడుదల కానుండడంతో వచ్చే నెలలో లబ్ధిదారులకు సర్కార్ సాయం అందనున్నది. ఒక్కో నియోజకవర్గానికి 3 వేల చొప్పున ఇండ్లను మంజూరు చేయనుండడంతో చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కల్వకుర్తి, రాజేంద్రనగర్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాలకు చెందిన 24 వేల మందికి లబ్ధి చేకూరనున్నది. ఇప్పటికే బహుళ అంతస్తులతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన ఇండ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉండగా, పెండింగ్లో ఉన్న తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ వంటి పనులను పూర్తి చేసేందుకు నిధులను మంజూరు చేసింది. ప్రస్తుతం మంజూరైన ఇండ్లతో పాటు జనరల్, స్సెషల్ కేటగిరీల కింద అర్హులకు సాయమందించేందుకు కసరత్తు చేస్తున్నట్లు జిల్లా అధికారులు పేర్కొంటున్నారు.
రంగారెడ్డి, మార్చి 12, (నమస్తే తెలంగాణ): రెండు పడకల ఇండ్ల పథకానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నది. ఇటీవల జరిగిన బడ్జెట్ కేటాయింపుల్లోనూ ఇండ్ల నిర్మాణానికి భారీగా నిధులను కేటాయించింది. ఆ నిధులను బడ్జెట్ సమావేశాలు పూర్తైన వెంటనే విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఈనెలాఖరులోగా ఆయా జిల్లాలకు డబుల్ బెడ్ రూం పథకానికి సంబంధించిన నిధులు విడుదల కానున్నాయి. అయితే వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న రెండు పడకల ఇండ్లను పూర్తి చేయడంతోపాటు సొంత స్థలం ఉన్న వారికి రూ.3 లక్షల ఆర్థిక సాయాన్ని అందించేందు కోసం రంగారెడ్డి జిల్లాకు రూ.900 కోట్ల నిధులను ప్రభు త్వం కేటాయించింది. అదేవిధంగా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 2,600 డబుల్ బెడ్ రూం ఇండ్లు పూర్తికాగా తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ తదితర మౌలిక వసతులను కల్పించాల్సి ఉన్నది. ప్రభుత్వం నిధులు కేటాయించిన వెంటనే ఆ పనుల పూర్తికి అధికారులు చర్యలు తీసుకోనున్నారు. వచ్చే నెలలోపు ఆ పనులను పూర్తి చేసి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధం గా జిల్లాకు 6,777 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేయగా, ఇప్పటివరకు 6,383 ఇండ్లకు టెండర్ల ప్రక్రియ
పూర్తై నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి.
సొంత స్థలం ఉండి ఇంటి నిర్మాణాన్ని చేపట్టిన వారికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక తదితర విధివిధానాలను ఈనెలాఖరులోగా ప్రభుత్వం ప్రకటించనుంది. నెల నుంచే ప్రభుత్వం డబ్బులు అందించనున్నది. ఇందులో భాగం గా ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల మంది లబ్ధిదారులకు నిధులను అందించనున్నది. ప్రభుత్వ నిర్ణయం తో జిల్లాలోని చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కల్వకుర్తి, రాజేంద్రనగర్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాలకు చెందిన 24 వేల మందికి లబ్ధి చేకూరనుంది. నియోజకవర్గానికి మూడు వేల మం దితోపాటు జనరల్ కోటా, ప్రత్యేక కోటా కింద అర్హులకు సాయం అందించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు జిల్లాలో ఇప్పటివరకు డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం 2.11 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
వచ్చే నెలలో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నా రు. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవకలు జరుగకుండా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దరఖాస్తుల వారీగా ఆధార్, రేషన్ కార్డు వివరాలతో దరఖాస్తుదారులకు సొంత ఇల్లు ఉన్నదా..? గతం లో ప్రభుత్వం నుంచి ఇంటిని పొందా రా..? భూమి, కారు ఉన్నదా..? అనే అంశాలపై టీఎస్టీఎస్ ఆధ్వర్యం లో విచారణ జరుగుతున్నది. ఇందులో ఎవరికైనా ఇప్పటికే ప్రభు త్వం నుంచి ఇల్లు మంజూరైనట్లు తేలితే ఆ దరఖాస్తును వారు తిరస్కరించి, మిగతా దరఖాస్తులను జిల్లా యంత్రాంగానికి అందజేయనున్నారు. కాగా ప్రస్తు తం జిల్లాలోని మహేశ్వరం, గండిపేట, రాజేంద్రనగర్, శంషాబాద్, ఫరూఖ్నగర్, జిల్లెడ్ చౌదరిగూడెం, కేశంపేట, కొందు ర్గు, కొత్తూరు, నందిగామ, శేరిలింగంపల్లి, హయత్నగర్, సరూర్నగర్ మండలాల్లోని దరఖాస్తుల పరిశీలనను చేపట్టారు. లబ్ధిదారుల గుర్తింపు, ఇండ్ల కేటాయింపును లాటరీ పద్ధ్దతి ద్వారా ఎంపిక చేయనున్నారు. కాగా ఆయా నియోజకవర్గాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లలో స్థానికులతోపాటు స్థానికేతరులకు కూడా నిర్దేశించిన కోటా ప్రకారం కేటాయించనున్నారు. ఇందు లో ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం, మైనార్టీలకు 7 శాతం, ఇతరులకు 43 శాతం లెక్కన ఇండ్లను కేటాయించనున్నారు. మరోవైపు జిల్లాలో 2,637 రెండు పడకల ఇండ్ల నిర్మాణం పూర్తి కాగా.. అందులో షాద్నగర్ నియోజకవర్గంలో 1,880 ఇండ్లు, ఇబ్రహీంపట్నంలో 335 ఇండ్లు, మహేశ్వరంలో 192 ఇండ్లు, రాజేంద్రనగర్లో 130 ఇండ్లు, చేవెళ్ల నియోజకవర్గంలో 100 ఇండ్ల నిర్మా ణం పూర్తయింది. అదేవిధంగా జిల్లాకు ప్రభుత్వం 6,777 ఇండ్లను మంజూరు చేయగా.. చేవెళ్ల నియోజకవర్గానికి 1,060 ఇండ్లు, కల్వకుర్తికి 738 ఇండ్లు, ఇబ్రహీంపట్నానికి 1,239 ఇండ్లు, షాద్నగర్కు 3,100 ఇం డ్లు, రాజేంద్రనగర్కు 240, మహేశ్వరం నియోజకవర్గానికి 400 ఇండ్లు మంజూరయ్యాయి. కాగా 6,383 ఇం డ్లకు సంబంధించి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది.
సీఎం కేసీఆర్ ఎల్లప్పుడూ పేదల సంక్షేమం, అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఇలాంటి నాయకుడు దేశానికి అవసరం. గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది నిరుపేదలు సొంత ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వారందరికీ ప్రభుత్వమే రెండు పడకల ఇండ్లను నిర్మించి ఇస్తున్నది. అంతేకాకుండా సొంత స్థలం ఉండి కూడా ఇండ్లను నిర్మించుకోలేని వారికోసం ప్రభుత్వం రూ.మూడు లక్షల ఆర్థిక సాయాన్ని అందించడం శుభపరిణామం. నిజమైన నాయకుడు సీఎం కేసీఆర్.
-భూమిరెడ్డి, మల్లాపూర్ గ్రామం, కొత్తూరు మండలం
రాష్ట్ర ప్రజల సమస్యలు, కష్టాలను తెలుసుకుని వారి ఇష్టానుసారంగా నడుస్తున్నారు సీఎం కేసీఆర్. అర్హులైన వారందరికీ వచ్చే నెల నుంచి రెండు పడకల ఇండ్లను కేటాయిస్తానని చెప్పడం సంతోషకరం. దీని ద్వారా ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న నిరుపేదల సొంతింటి కల నెరవేరనున్నది. సీఎం కేసీఆర్కు ఎల్లవేళలా రుణపడి ఉంటాం.
-వన్నం శేఖర్, పెంజర్ల గ్రామం, కొత్తూరు మండలం
తెలంగాణ ప్రభుత్వం రెండు పడకల ఇండ్లను నిర్మించి నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చుతున్నది. అంతేకాకుండా సొంతంగా ఇండ్లను నిర్మించుకునేందుకు ప్రభుత్వం రూ. మూడు లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తామని ప్రకటించడం గొప్ప నిర్ణయం.
– ఈశ్వర్యాదవ్, నందిగామ
వచ్చే నెల నుంచి సొంత స్థలాలు ఉన్న పేదలు ఇండ్లను నిర్మించుకునేందుకు ప్రభుత్వం రూ.మూడు లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ఇస్తామని ప్రకటించడం ఎంతో సంతోషకరం. సొంత స్థలాలుండి డబ్బులు లేక ఎంతోమంది ఇండ్లను నిర్మించుకోలే ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం సొంతంగా ఇండ్లను నిర్మించుకునేందుకు ఆర్థిక సాయాన్ని అందించడం గొప్ప నిర్ణయం. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
-రవీందర్రెడ్డి, శంకర్పల్లి
గ్రామాల్లో సొంత స్థలాలు ఉన్న పేదలకు ఇండ్లు నిర్మించుకునేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం రూ.మూడు లక్ష లు ఇచ్చి ఆదుకోవడం సంతోషకరం. మాలాంటి పేద వారికి ఇది ఎంతో దోహదపడుతుంది. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని అమలు చేయలేదు. -వడ్ల లక్ష్మి, మోత్కుపల్లి, మొయినాబాద్
గ్రామాల్లోని అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని చెప్పడం సంతోషంగా ఉంది. ఎంతోమంది పేదలు ఇండ్లు లేక అద్దె ఇండ్లల్లో బతుకుతున్నారు. పేదల కష్టాలను గుర్తించిన సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు
-శ్రీనివాస్, అంతారం, చేవెళ్ల
తెలంగాణ ప్రభుత్వం రెండు పడకల ఇండ్లను నిర్మించి నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చుతున్నది. అర్హులం దరికీ ఇండ్లను కేటాయిస్తామని చెప్పడం సంతోషకరం. దీంతో గుడిసెలు, అద్దె ఇండ్లల్లో జీవిస్తున్నా వారికి ఒక గూడు దొరుకుతుంది.
-బాలాజీ ఉదయ్, తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం తాలూకా కన్వీనర్ షాద్నగర్
సొంత స్థలాలు ఉన్న పేదలు ఇండ్లను నిర్మించుకునేందుకు ప్రభుత్వం రూ.మూడు లక్షల చొప్పున ఆర్థిక సా యాన్ని అందిస్తామని ప్రకటించడం సంతోషకరం. ప్రభు త్వం ఇచ్చే డబ్బులు ఇంటి నిర్మాణానికి ఆసరాగా ఉంటా యి. నిరుపేదల కోసం గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత మంచి ఆలోచన చేయలేదు. పేదల సొంతింటి కలను నిజం చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కింది.
– శ్రీనూనాయక్, పట్టణవాసి షాద్నగర్
సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారు. ఇటీవలే 80 వేల పైచిలుకు ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించి నిరుద్యోగుల్లో ఆశలను చిగురింపజేశారు. అదేవిధంగా సొంత స్థలం ఉంటే ఇంటి నిర్మాణానికి రూ.మూడు లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తామని చెప్పడం సంతోషకరం. దీంతో నిరుపేదల సొంత ఇంటి కల నెరవేరుతుంది.
– చింతకింది సిద్ధ్దు, బైరంపల్లి గ్రామం, కొందుర్గు మండలం
నిరుపేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేసింది. అర్హులందరికీ రెండు పడకల ఇండ్లను నిర్మించి సొంతింటి కలను నెరవేర్చుతున్నది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
-మశ్చేందర్, హాజీపల్లి గ్రామం, షాద్నగర్
తెలంగాణ ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు రూ. మూడు లక్షల ఆర్థిక సాయా న్ని అందించడం సంతోషకరం. గ్రామాల్లో ఇప్పటికీ చాలా మంది సొంత ఇల్లు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. అద్దె ఇండ్లల్లో జీవిస్తున్నారు. వారందరికీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సొంతింటి కల నెరవేరుతుంది.
-లక్ష్మీనారాయణగౌడ్, మార్కెట్ కమిటీ మాజీ వైస్చైర్మన్, షాద్నగర్