తిరువనంతపురం : కేరళలోని మయ్యిల్ గ్రామంలో వీధి కుక్కల దాడులపై అవగాహన కల్పించేందుకు ఓ నాటకాన్ని ప్రదర్శించారు. రాధాకృష్ణన్ అనే కళాకారుడు సహజత్వం కోసం ప్రయత్నించారు. ఓ బాలుడిపై కుక్క దాడి చేయడం, ఆ బాలుడు కేకలు వేసే సన్నివేశం ఉంటుంది. దీని కోసం కుక్కలు మొరుగుతున్నట్లు, బాలుడు కేకలు వేస్తున్నట్లు ఓ రికార్డును మైక్లో వినిపించారు. అదే సమయంలో ఓ కుక్క వచ్చి, రాధాకృష్ణన్ను కరిచింది. నాటకాన్ని చూస్తున్నవారు ఇది కూడా నాటకంలో భాగమేనని భావించారు. రాధాకృష్ణన్ నొప్పితోనే 15 నిమిషాలపాటు ప్రదర్శనను కొనసాగించి, పూర్తి చేశారు. ఆ తర్వాతే దవాఖానకు వెళ్లి, చికిత్స చేయించుకున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నది.