కామారెడ్డి, ఏప్రిల్ 28 : ప్రచారంలో భాగంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలకు మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. అనుమతి పొందకుండా ప్రకటనల ప్రచురణ, ప్రసారం చేసినా ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందికి వస్తుందని తెలిపారు. అనుచరులు చేసిన ఖర్చును కూడా అభ్యర్థి ఖాతాలోనే చూపిస్తామని పేర్కొన్నారు. ఒకవేళ అభ్యర్థి సమ్మతించకుంటే పబ్లిషర్పై చర్య తీసుకుంటామని తెలిపారు. ఎన్నికల కరపత్రాలు, పోస్టర్లు, ఇతర ప్రచార మెటీరియల్ను ముద్రించేటప్పుడు తప్పనిసరిగా అనుమతి పొందాలని సూచించారు. లౌడ్ స్పీకర్లు, వాహనాలకు కూడా ముందస్తు అనుమతి పొందాలని తెలిపారు. పోలింగ్కు రెండు రోజుల ముందు సైలెన్స్ పీరియడ్ చాలా కీలకమని, న్యూస్ రిపోర్టింగ్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎన్నికలకు సంబంధించి ఏదైనా సమాచారం కోసం 1950కు ఫోన్ చేయాలని తెలిపారు.