మక్తల్టౌన్, అక్టోబర్ 26: రైతుల పొట్టకొట్టేందుకు కాంగ్రెస్పార్టీ యత్నిస్తున్నదని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందరాదనే లక్ష్యంతో పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్చార్జ్జి మానిక్రావ్ ఠాగూర్ బృందం రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, గృహలక్ష్మి వంటి పథకాలను వెంటనే నిలిపి వేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడాన్ని నిరసిస్తూ గురువారం ఎమ్మెల్యే తన నివాసంలో మక్తల్ ఎన్నికల ఇన్చార్జ్, తెలంగాణ స్పోర్ట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశాన్ని 60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల గోస ఏనాడు పట్టించుకోలేదన్నారు. వ్యవసాయాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకురావాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు పథకం అమలు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను నట్టేట ముంచాలనే లక్ష్యంతో వాటిని నిలిపి వేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి, రైతులనోట మట్టికొట్టాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో భూస్థాపితం చేయాలని కోరారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఆంజనేయగౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి రోజు రోజుకూ పెరుగుతున్న ప్రజల మద్దతును చూసి కాంగ్రెస్ ఓటమి భయంతో సంక్షేమ పథకాలను నిలిపి వేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిందన్నారు. సమావేశంలో రైతుబంధు సమితి సభ్యు రాలు చిట్టెం సుచరితారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీనివాస్గుప్తా, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్రెడ్డి, పట్టణాధ్యక్షుడు అమరేందర్రెడ్డి, నాయకులు మారుతీగౌడ్, షాలం,శంషొద్దీన్, మల్రెడ్డి, మైమూద్, వల్లంపల్లి మధు, నేతాజీ, నర్సింహ, కృష్ణయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
మాగనూర్, అక్టోబర్ 26: రైతు బంధు పథకాన్ని నిలిపి వేయాలంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గురువారం మండలంలోని బైరం పల్లి గ్రామ రైతులు కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ వెంకటయ్య, సర్పంచ్ మంజులా రాఘవేంద్ర, ఎంపీటీసీ ఎల్లారెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ వెంకటరెడ్డి,రైతులు రఘు, రాఘవేంద్ర, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
కృష్ణ, అక్టోబర్ 26 : మండలంలోని గుడెబల్లూర్ ప్రధా న రాహదారిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టి బొ మ్మను దహనం చేశారు. కార్యక్రమంలో రైతులు తిమ్మప్ప, అమరేశ్, ఆంజనేయులు, మహదేవప్ప, సురేశ్, రవి, వెంకటేశ్, శంకరప్ప, శివప్ప, మోనేశ్, శంకర్, దేవేంద్రప్ప, వెంకటప్ప, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
అమరచింత, అక్టోబర్ 26: తమ మ్యానిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలను తెలంగాణ ప్రజలు నమ్మడం లేదని భావించిన కాంగ్రెస్ నాయకులు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న రైతుబంధు, దళిత బంధు పథకాలను నిలి పి వేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని అమరచింత మున్సిపల్ చైర్పర్సన్ మంగమ్మ, ఆత్మకూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, మాజీ జెడ్పీటీసీ రాజేందర్సింగ్, రైతు బంధుసమితి మండల అధ్యక్షుడు చుక్క అశిరెడ్డి గురువారం విలేకరుల సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేశ్, పట్టణాధ్యక్షుడు నర్సింహులుగౌడ్, మున్సిపాల్ కౌన్సి లర్లు, కో ఆఫ్షన్ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
ఆత్మకూరు, అక్టోబర్ 26: బీఆర్ఎస్ మండల అధ్య క్షుడు రవికుమార్యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్పార్టీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బంగా రు శ్రీనివాసులు, మున్సిపల్ చైర్పర్సన్ గాయత్రి యాదవ్, వైస్ చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, వైస్ ఎంపీపీ కోటేశ్వర్, పీఏసీసీఎస్ అధ్యక్షుడు గాడి కృష్ణమూర్తి, లక్ష్మికాంత్రెడ్డి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
దేవరకద్ర, అక్టోబర్ 26: రైతు బంధు పథకాన్ని వెంటనే నిలిపి వేయాలంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పిలుపు మేరకు మండల బీఆర్ఎస్ నాయకులు గురువారం ఎంపీ ఉత్తమ్కుమార్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జెట్టి నర్సింహారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ అని వచ్చే ఎన్నికల్లో ఆపార్టీకి తగిన బుద్ధిచెప్పాలని రైతులకు పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో రైతుబంధు మం డల అధ్యక్షుడు కొండారెడ్డి, సహకార సంఘం చైర్మన్ డోకూర్ నరేందర్రెడ్డి, మండల కో ఆప్ష న్ ఖదీర్ పాషా, పట్టణ అధ్యక్షుడు బాలరాజు, నాయకులు శివానంద్, సత్యంసాగర్, యుగేందర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, కుర్వరాము, రాధాకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
దేవరకద్ర రూరల్(చిన్న చింతకుంట), అక్టోబర్ 26: ఎంపీపీ హర్షవర్ధ్దన్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోట రాము ఆధ్వర్యంలో రైతులు బండర్పల్లి చౌరస్తాలో ఉత్తం కుమార్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో పీఏసీసీఎస్ అధ్యక్షుడు సురేందర్రెడ్డి, కురుమూర్తి ఆలయ చైర్మన్ ప్రతాప్రెడ్డి, రైతుబంధు జిల్లా సభ్యులు కరుణాకర్రెడి తదితరులు పాల్గొన్నారు.
భూత్పూర్, అక్టోబర్ 26: మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్ ఆధ్వర్యంలో గురువారం రైతులు పట్టణంలోని చౌరస్తాలో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహాగౌడ్ మాట్లాడుతూ రైతుబంధు పథకం అమలుపై కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ ఉత్తం కుమార్రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం రైతుల పొట్టకొట్టడమేనన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నరేష్గౌడ్, కౌన్సిలర్ శ్రీనివాస్రెడ్డి, ముడా డైరెక్టర్లు చంద్రశేఖర్గౌడ్, సాయిలు, మాజీ సర్పంచ్ సత్తూర్ నారాయణగౌడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మనెమోని సత్యనారాయణ, గోప్లాపూర్ సత్యనారాయణ, సురేష్గౌడ్, అశోక్గౌడ్, గడ్డంరాములు, నర్సిములు, గడ్డం ప్రేమ్కుమార్, రమేష్చందర్ తదితరులు పాల్గొన్నారు.
మూసాపేట, అక్టోబర్ 26 : మండల కేంద్రంలో రైతులు కాంగ్రెస్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, నాయకుల లక్ష్మీనర్సింహా యా దవ్, కొండయ్య, రఘుపతిరెడ్డి, చంద్రశేఖర్, శ్రీనివాసులు, లక్ష్మణ్, స్వరూప, అంజనేయులు, రైతులు పాల్గొన్నారు.
మూసాపేట(అడ్డాకుల), అక్టోబర్ 26 : అడ్డాకుల మండ ల కేంద్రంలోని బస్టాండ్ అవరణలో గురువారం రైతుల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నాగార్జునరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.
కొత్తకోట,అక్టోబరు 26: మండల కేంద్రంలో జెడ్పీవైస్ చైర్మన్ వామన్గౌడ్ ఆధ్వర్యంలో రైతులు కాంగ్రెస్ నేత ఉత్తమ్కుమార్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కనిమెట్టలో ఎంపీపీ గుంతమౌనిక ఆధ్వర్యంలో ఉత్తమ్కుమార్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, కొండారెడ్డి, ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి ప్రశాంత్, ఆకుల శ్రీను, బాబురెడ్డి, బీంరెడ్డి, సంద్య, పద్మ, తిరుపతయ్య, తదితరులు పాల్గొన్నారు.
మదనాపురం, అక్టోబర్ 26 : మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో బీఆర్ఎస్ శ్రేణులు రైతులతో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో దుప్పల్లి సర్పంచ్ శివశంకర్, ఆయాగ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.