న్యూఢిల్లీ, అక్టోబర్ 22: దేశీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూకు రంగం సిద్ధమవుతున్నది. డిజిటల్ ఆధారిత ఆర్థిక సేవల సంస్థ పేటీఎం ఐపీవో (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఆమోదం తెలిపింది.ఇష్యూ విలువ రూ.16,600 కోట్లు. ఇప్పటిదాకా ప్రభుత్వ రంగ బొగ్గు ఉత్పాదక దిగ్గజం కోల్ ఇండియా ఐపీవో (రూ.15,200 కోట్లు)నే దేశంలో అతిపెద్దది. పేటీఎం ఇష్యూ విజయవంతమైతే కోల్ ఇండియా రికార్డు కనుమరుగైపోనున్నది. ఈ నెలాఖర్లోనే షేర్ల అమ్మకాలకు పేటీఎం ముందుకు రావచ్చని సమాచారం.