నల్లగొండ : నాగార్జున సాగర్ ఉప ఎన్నికలకు బీజేపీ తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. డాక్టర్ పానుగోతు రవికుమార్ అభ్యర్థిత్వాన్ని బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది.
మంగళవారం రవికుమార్ నామినేషన్ వేయనున్నారు. పానుగోతు రవికుమార్ స్వస్థలం త్రిపురారం మండలం పలుగుతండా.
రవికుమార్ భార్య సంతోషి కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్గా గెలుపొంది ఇటీవల బీజేపీలో చేరారు. ప్రస్తుతం రవికుమార్ హాలియాలో ఉంటూ ప్రైవేట్ దవాఖానను నిర్వహిస్తున్నారు.
గత స్థానిక సంస్థల ఎన్నికల్లో సాగర్ (తిరుమలగిరి) కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన రవికుమార్ టీఆర్ఎస్ అభ్యర్థి సూర్యబాషానాయక్ చేతిలో ఓటమి పాలయ్యారు.