భువనగిరి అర్బన్, నవంబర్ 14: రాష్ట్రస్థాయి జూనియర్ బాలుర అంతర్ జిల్లాల హాకీ టోర్నమెంట్లో పాలమూరు జట్టు విజేతగా నిలిచింది. యాదాద్రి భువనగిరిలో ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో మహబూబ్నగర్ 2-0తో మెదక్పై విజయం సాధించింది. టోర్నీలో అద్వితీయ ప్రదర్శన కనబర్చిన మహబూబ్నగర్ కెప్టెన్ సంతోష్ ఉత్తమ క్రీడాకారుడిగా ఎంపికయ్యాడు. హైదరాబాద్ జట్టు తృతీయ స్థానంలో నిలిచింది. విజేతలకు యాదాద్రి జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే శేఖర్రెడ్డి బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రిపుల్ ఒలింపియన్ ముకేశ్, కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.