న్యూఢిల్లీ : భారతదేశం నుంచి 19 నెలల తర్వాత పత్తి, చక్కెరలను దిగుమతి చేసుకునేందుకు పాకిస్తాన్ ఆమోదం తెలిపింది. ఆర్థిక కమిటీ ఈ మేరకు బుధవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పాకిస్తాన్ భారత్తో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని తిరిగి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తున్నది. 2021 జూన్ 30 నుంచి భారతదేశం నుంచి పత్తి, చక్కెరలను దిగుమతి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది.
భారతదేశం నుంచి దిగుమతులపై దాదాపు రెండేండ్ల నిషేధాన్ని ఎత్తివేస్తూ కొత్తగా నియమించిన ఆర్థిక మంత్రి హమ్మద్ అజార్ బుధవారం ఒక ప్రకటన చేశారు. చక్కెర, కాటన్ దిగుమతికి అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
పాకిస్తాన్ ఆర్థిక సమన్వయ కమిటీ (ఈసీసీ) ప్రైవేటు రంగానికి భారతదేశం నుంచి 5 లక్షల టన్నుల చక్కెరను దిగుమతి చేసుకోవడానికి అనుమతించిందని మంత్రి హమ్మద్ అజార్ చెప్పారు. భారతదేశంలో చక్కెర ధర చాలా చౌకగా ఉన్నదని పాకిస్తాన్కు చెందిన జియో టీవీ పేర్కొన్నది. అందువల్ల భారత్తో చక్కెర వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. ఈ ఏడాది జూన్ నుంచి భారత్ నుంచి పాకిస్తాన్ పత్తి దిగుమతి ప్రారంభిస్తుందని హమ్మద్ అజార్ ప్రకటించారు.
భారతదేశం నుంచి పత్తి దిగుమతుల బ్యాంక్ దేశంలోని చిన్న, మధ్యతరహా పరిశ్రమలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిందని అజార్ చెప్పారు. అయితే, వాణిజ్య మంత్రిత్వ శాఖ సిఫారసు మేరకు భారత్తో పత్తి వాణిజ్యాన్ని తిరిగి ప్రారంభించాలని కూడా నిర్ణయించామని ఆయన అన్నారు.
చక్కెర, పత్తి దిగుమతుల పునఃప్రారంభం భారతదేశం-పాకిస్తాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను పాక్షికంగా పునరుద్ధరిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఇది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి సంకేతంగా చెప్పుకోవచ్చు.
2019 ఆగస్టులో జమ్ముకశ్మీర్ ప్రత్యేక హోదాను ఉపసంహరణకు భారతదేశం తీసుకున్న చర్యల తరువాత పాకిస్తాన్ దౌత్య సంబంధాలను తగ్గించి.. 2019 ఆగస్టులో భారత్తో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని నిలిపివేసింది.
ముఖ్యమంత్రి నా శాఖలో తలదూరుస్తున్నారు: గవర్నర్కు మంత్రి ఫిర్యాదు
వ్యవసాయాన్నిలాభసాటిగా మార్చడానికి సంస్కరణలు తేవాలి: వెంకయ్యనాయుడు
ఈ గడ్డపై చిప్ తయారు చేస్తే 7 వేల కోట్ల ప్రోత్సాహం : కేంద్ర ప్రభుత్వం ఆఫర్
డబ్ల్యూహెచ్ఓకు మొత్తం కొవిడ్ డాటా ఇచ్చాం : చైనా శాస్త్రవేత్త స్పష్టీకరణ
ఫ్రస్టేషన్లో టార్చిలైట్ విసిరివేసిన కమల్ హాసన్
ఇష్రత్ జహాన్ ఎన్కౌంటర్ కేసు : చివరి ముగ్గురు నిందితులు విడుదల
ఎక్కువ రోజులు అంతరిక్షంలో ఉండేవారికి కుచించుకుపోనున్న గుండె.. వ్యోమగాములపై పరిశోధన
చిన్నారుల్లో త్వరలో కరోనా వైరస్ కొత్త రూపం.. వ్యాక్సిన్ ఇప్పించడం తప్పనిసరి
భారతదేశానికి వచ్చిన దలైలామా.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..