చెన్నై : ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ తరఫున అభ్యర్థులను నిలిపిన ప్రముఖ నటుడు కమల్హాసన్.. ప్రచారంలో నిమగ్నమైపోయారు. గత వారం పదిరోజులుగా తమిళనాడు వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే, విరామం లేకుండా ప్రచారం చేస్తుండటంతో కమల్హాసన్ కొంత అలసిపోయినట్లుగా కనిపిస్తున్నారు.
ఈ ఉదయం రోడ్షో సందర్భంగా ఫ్రస్టేషన్కు లోనయ్యాడు. కోపం పట్టలేక చేతిలోని తన పార్టీ గుర్తు అయిన టార్చిలైట్ను విసిరికొట్టాడు. దాంతో అక్కడ వచ్చిన అభిమానులు, పార్టీ కార్యకర్తలు విస్తుపోయారు.
ఉదయం చెన్నైలో కమల్ హాసన్ రోడ్షో చేపట్టాడు. ఒక ప్రాంతంలో గుమిగూడిన అభిమానులను ఉద్దేశించి ప్రసంగించేందుకు కమల్ హాసన్ ఉద్యుక్తుడయ్యాడు. అయితే, మైక్రోఫోన్ పనిచేయకపోవడంతో కోపం నశాలానికి అంటింది. అంతే చేతిలో ఉన్న పార్టీ గుర్తు టార్చిలైట్ను అమాంతం నేలకేసి విసిరికొట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తొలిసారి పార్టీ పెట్టి ఎన్నికల బరిలో నిలిచి ప్రచారం చేయడంతో బాగా అలిసిపోయి ఫ్రస్టేషన్కు గురై ఉంటారని పార్టీ నాయకులు చెప్తున్నారు. రాజకీయాలకు కొత్త కావడంతో ఓపిక నశించడం వల్లనే అలా ప్రవర్తి ఉంటాడని స్థానికులు అనుకున్నారు.
మూడున్నరేండ్ల క్రితం ఎంఎన్ఎం పార్టీని స్థాపించి తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో అమితుమికి సిద్ధమయ్యారు కమల్ హాసన్. దక్షణ కోయంబత్తూరు నుంచి కమల్ హాసన్ పోటీ పడుతున్నారు. కమల్పై బీజేపీ నుంచి వనతి శ్రీనివాసన్, కాంగ్రెస్ నుంచి మయూర జయకుమార్లు పోటీ చేస్తున్నారు.
ఇష్రత్ జహాన్ ఎన్కౌంటర్ కేసు : చివరి ముగ్గురు నిందితులు విడుదల
ఎక్కువ రోజులు అంతరిక్షంలో ఉండేవారికి కుచించుకుపోనున్న గుండె.. వ్యోమగాములపై పరిశోధన
చిన్నారుల్లో త్వరలో కరోనా వైరస్ కొత్త రూపం.. వ్యాక్సిన్ ఇప్పించడం తప్పనిసరి
భారతదేశానికి వచ్చిన దలైలామా.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..