ఇస్లామాబాద్ : కరాచీలోని పాకిస్తాన్ యూనివర్సిటీలో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయాలకు గురయ్యారని జియో టీవీ పేర్కొంది. కరాచీ యూనివర్సిటీలోని కన్ఫ్యూషయస్ ఇన్స్టిట్యూట్ సమీపంలోని వ్యాన్లో పేలుడు సంభవించింది. ఘటన అనంతరం రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. పోలీసులు ఆ సంఘటనా స్థలానికి చేరుకొని ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. పేలుడు సమయంలో కారు వద్ద ఏడు నుంచి ఎనిమిది వరకు ఉన్నట్లు సమాచారం.