మెదక్ : రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ రోడ్లును బీటీ రోడ్లుగా నిర్మాణం చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందు లు పడుతున్నారని తెలిపారు . సోమవారం మెదక్ జిల్లా వెల్దుర్తి నుంచి మెదక్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణం చేయాలని మాజీ మంత్రి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి చేస్తున్న పాదయాత్రకు మద్దతుగా మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమో మాట్లాడుతూ.. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం బీటీ రోడ్లు నిర్మాణం చేసేందుకు నిధులు మంజూరు చేయగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిధులు రద్దు చేసిందని విమర్శించారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని హామీనిచ్చిన ప్రభుత్వం గెలిచాక ప్రజలను మోసం చేసిందనన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున పోరాడుతుందన్నారు.