రాయపోల్ ఆగష్టు 02 : ప్రజా యుద్ద నౌక గద్దర్ రెండవ వర్ధంతి సభను జయప్రదం చేయాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ పిలుపునిచ్చారు. ఆగస్టు 6 హైదరాబాద్లోని రవింద్రభారతిలో నిర్వహిస్తున్న వర్ధంతి సభ వాల్ పోస్టర్ను శనివారం రాయపోల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ.. పిడిత ప్రజల విముక్తి కోసం గద్దరన్న జీవితాంతం పొరాడారని గుర్తుచేశారు. గద్దర్ ఫౌండేషన్ అధ్వర్యంలో గద్దరన్న రెండవ వర్దంతి సభను నిర్వహిస్తున్నారన్నారు. ఈ సభకు కళాకారులు, ప్రజసంఘాల నాయకులు ప్రజలు తరలిరవాలని కోరారు. రవీంద్రభారతిలో అగస్టు 6న మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి వరకు కొనసాగుతదని తెలిపారు.ఈ కార్యక్రమంలో డిబిఎఫ్ జిల్లా కార్యదర్శి బ్యాగరి వేణు, ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.