టీఆర్ఎస్ సైన్యం భగ్గుమన్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఇంటిపై దాడికి యత్నించడం పై కన్నెర్రజేసింది. సిరిసిల్ల నియోజకవర్గ వ్యాప్తంగా శనివారం ఎక్కడికక్కడ కార్యకర్తలు, నాయకులతో కలిసి ఆందోళనకు దిగింది. బీజేపీ రౌడీయిజాన్ని సహించేదిలేదని, గూండాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఆయాచోట్ల ప్రధాన రహదారులపై బైఠాయించింది. గంటలకొద్ది నిరసన తెలిపి బాధ్యులపై చర్యలు తీసుకునేదాకా కదిలేదిలేదని భీష్మించింది. అప్పటికే బాధ్యులపై పోలీసులు కేసులు పెట్టడడం, మిగతావారిపైనా నమోదు చేస్తామని హామీ ఇవ్వడంతో ఎట్టకేలకు శాంతించింది.
ఎల్లారెడ్డిపేట, మార్చి 19: రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా శనివారం ఆందోళనలు, నిరసనలు పెల్లుబికాయి. తంగళ్లపల్లిలోని మానేరు వంతెనపై టీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో చేశారు. బీజేపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇల్లంతకుంట బస్టాండ్ ఆవరణలో బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ముస్తాబాద్లో తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట ధర్నా చేశారు. బీజేపీ నేతలు అధికార కాంక్షతోనే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
ఎల్లారెడ్డిపేట అట్టుడికింది. దాడి విషయం తెలుసుకొని జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన నాయకులు ముందుగా తోట ఆగయ్యను పరామర్శించారు. అనంతరం ర్యాలీగా బయలు దేరి మం డల కేంద్రంలోని కామారెడ్డి-కరీంనగర్ ప్రధాన ర హదారిపై పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అక్కడే గం టపాటు బైఠాయించారు. బీజేపీ గూండాలను వెం టనే అరెస్ట్ చేయాలని, లేదంటే కదిలేదని భీష్మించా రు. ఎస్పీ రాహుల్ హెగ్డే అక్కడికి చేరుకొని ఇప్పటికే 12 మందిపై కేసులు నమోదు చేశామని, మిగతావారిని సీసీ ఫుటేజీల ఆధారంగా గుర్తించి కేసులు పెడతామని హామీ ఇవ్వడంతో శాంతించారు. ఇక్కడ ఎంపీపీలు పిల్లి రేణుక, జనగామ శరత్రావు, జడ్పీటీసీ చీటి లక్ష్మణ్రావు, కొమిరిశెట్టి విజ య, ఏఎంసీ చైర్మన్ కొండ రమేశ్గౌడ్, మాజీ చైర్మ న్ అందె సుభాష్, గుల్లపల్లి నర్సింహారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వర్స కృష్ణహరి, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, వైస్ఎంపీపీ కదిరె భాస్కర్, సుధాకర్రావు, ఎడ్ల లక్ష్మణ్, సందీప్, బొల్లి రామ్మోహన్, అజ్మీరా రాజునాయక్, అప్సరున్నీసా, బాల్రెడ్డి, పందిళ్ల నాగరాణి, అనసూయ పాల్గొన్నారు.