హుజూరాబాద్ టౌన్ : సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్తోనే వంద శాతం న్యాయం జరిగిందని, తెలంగాణ ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల పక్షపాతిగా నిలుస్తున్నదని సీనియర్ సిటిజన్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు పీటీ స్వామి అన్నారు.ఆదివారం హుజూరాబాద్లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
సీఎం కేసీఆర్ అడగకుండానే కోల్మైన్స్ ఉద్యోగుల సంక్షేమం కోసం విశేషంగా కృషిచేస్తున్నారని తెలిపారు. కేంద్రం నిర్లక్ష్యంతోనే సింగరేణి రిటైర్డు ఉద్యోగులకు సరైన న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. 40వేల మంది రిటైర్డ్ బొగ్గు గని కార్మికుల పింఛన్ పెంచేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్రావును కోరగా.. పెంచిన బోనస్ను దసరాకు ఇప్పించారని కృతజ్ఞతలు తెలిపారు.
90శాతం మంది రిటైర్డ్ ఉద్యోగులు గెల్లు శ్రీనివాస్కు మద్దతుగా నిలిచారని, 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని స్వామి తెలిపారు. వర్కింగ్ ప్రెసిడెంట్ పూరెళ్ల వెంకటేశం మాట్లాడుతూ తమను ఆదరించే పార్టీకే పూర్తి మద్దతు ఉంటుందన్నారు.
పల్లెల్లో తిరుగుతూ.. టీఆర్ఎస్కు ఓటేయాలని రిటైర్డ్ ఉద్యోగులను కోరుతున్నామని తెలిపారు. సమావేశంలో రిటైర్డు ఉద్యోగుల సంఘం నాయకులు ఎల్.శంకర్రావు, బి.చక్రపాణి, పి.మొగిలయ్య, పి.మల్లయ్య, శ్రీనివాసరావు, గెల్లు రాజలింగం ఉన్నారు.