ములుగు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంచోటు చేసుకుంది. కారును బొలెరో వాహనం ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన ములుగు జిల్లా తాడ్వాయి సమీపంలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..ఖమ్మం జిల్లాకు చెందిన రాం కుమార్ అనే వ్యక్తి కారులో హైదరాబాద్ నుంచి ఏటూరు నాగారం వస్తున్నాడు.
ఈ క్రమంలో తాడ్వాయి సమీపంలోని 163వ జాతీయ రహదారిపై బొలెరో వాహనం కారు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో రాంకుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాల య్యాయి. క్షతగాత్రులను ములుగు దవాఖానకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.