న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: భారత్, టర్కీ, దుబాయ్లో వ్యాపార విస్తరణ నిమిత్తం అధికారులకు ముడుపులు చెల్లించిన కేసులో టెక్ దిగ్గజం ఒరాకిల్కు అమెరికా సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) భారీ జరిమానా విధించింది. జరిమానా కింద 2.3 కోట్ల డాలర్లు (సుమారు రూ.187 కోట్లు) కట్టాలని ఆదేశించింది. వ్యాపార అవసరాల నిమిత్తం అధికారులకు లంచాలు ఇచ్చేందుకు అక్రమనిధిని ఏర్పాటు చేసినట్టు దర్యాప్తులో వెల్లడైంది. దీంతో విదేశీ అవినీతి వ్యవహారాల చట్టం కింద ఒరాకిల్కు జరిమానా వేశారు.
భారత్లో రైల్వే విభాగం యాజమాన్యంలోని ఓ రవాణా కంపెనీకి ఒరాకిల్ సేల్స్ సిబ్బంది భారీస్థాయిలో రాయితీలు ఇచ్చారు. పోటీని తట్టుకుని ఓ సాఫ్ట్వేర్ కాంట్రాక్టు దక్కించుకునేందుకు అసాధారణమైన రీతిలో 70 శాతం రాయితీ ఇవ్వడం అనుమానాలకు తావిచ్చింది. ప్రభుత్వ యాజమాన్యంలోని రవాణా సంస్థ అధికారులకు 67,000 డాలర్లు (సుమారు రూ.54,65,000) ముడుపుగా చెల్లించేందుకు అక్రమ మార్గాల ద్వారా ‘ప్రత్యేక ఖాతా’లు ఏర్పాటు చేశారు. ఒరాకిల్ ఎస్ఈసీ నిరక్ణయాన్ని సవాల్ చేయకుండా మొత్తం 2.3 కోట్ల డాలర్ల జరిమానా కట్టేందుకు అంగీకరించడం గమనార్హం.