న్యూఢిల్లీ, జూలై 7: భారత వయోజనుల్లో ఊబకాయుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. రక్తహీనతతో బాధపడుతున్న మహిళల సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నది. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి-2022 నివేదిక వెల్లడించింది. ఊబకాయం ఉన్న పెద్దల సంఖ్య 2012లో 2.52 కోట్ల నుంచి 2016లో 3.43 కోట్లకు పెరిగింది.
అలాగే రక్తహీనతతో బాధపడుతున్న 15 నుంచి 49 ఏండ్ల వయసు మహిళల సంఖ్య కూడా 2012లో 17.15 కోట్ల నుంచి 2019లో 18.73 కోట్లకు పెరిగింది. కొవిడ్ నేపథ్యంలో 2021లో ప్రపంచవ్యాప్తంగా ఆకలితో బాధపడుతున్న వారి సంఖ్య 82.8 కోట్లకు పెరిగింది. పోషకాహారంలోపం ఉన్న వారి సంఖ్య దేశంలో తగ్గుతున్నది. 2004-06లో పోషకాహారంలోపం ఉన్న వారి సంఖ్య 24.78 కోట్లు ఉండగా, 2019-21లో 2.43 కోట్లకు తగ్గింది.