హైదరాబాద్, జనవరి 25 : జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఎన్నికల సంఘం ప్రయత్నిస్తున్నది. ఓటర్లుగా నమోదు చేసుకోవడం మొదలుకొని జాబితాలో పేర్ల పరిశీలన, సవరణలు, మార్పుల కోసం కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సొంత మొబైల్ ఫోన్తో ఉన్న చోటు నుంచే చేసుకొనే అవకాశాన్ని ప్రజలకు కల్పించింది. ఇందుకోసం ఎన్నికల సంఘం ‘ఓటర్ హెల్ప్లైన్’ యాప్ను అభివృద్ధి చేసింది. ఈ యాప్ను మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకొంటే ఓటర్ల జాబితాను ఎప్పుడు కావాలంటే అప్పుడు పరిశీలించి మార్పు లు, చేర్పులు చేసుకోవచ్చు. సందేహాలుంటే ఉదయం 10.30 నుం చి సాయంత్రం 5 గం టలలోపు 1950 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేయవచ్చు. ఓటర్లకు నాణ్యమైన సేవలు అందించేందుకు ’ఓటర్ హెల్ప్లైన్’ యాప్ను ఏర్పాటు చేసిన ఎన్నికల కమిషన్కు గవర్నర్ తమిళిసై ధన్యవాదాలు తెలిపారు. ఓటర్ల దినోత్సవం సందర్భంగా మంగళవారం రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. నల్లగొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కొత్త ఓటర్లకు ఫొటో గుర్తింపు కార్డులతోపాటు కిట్లను పంపిణీచేశారు. సీఈవో శశాంక్ గోయల్ తన కార్యాలయంలో బెస్ట్ ఎలక్షన్ ప్రాక్టీస్ అవార్డులను గ్రహీతలకు అందజేశారు. బీఆర్కేభవన్లో ఉద్యోగులతో సీఎస్ సోమేశ్కుమార్ ప్రతిజ్ఞ చేయించారు.