జయశంకర్ భూపాలపల్లి, ఏప్రిల్ 19(నమస్తే తెలంగాణ): పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ శుక్రవారం నామినేషన్ (రెండు సెట్లు) దాఖలు చేశారు. ఆయన వెంట పెద్దపల్లి, రామగుండం, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్రెడ్డి, కోరుకంటి చందర్, దుర్గం చిన్నయ్య ఉన్నారు. కాగా నామినేషన్ కార్యక్రమానికి భూపాలపల్లి జిల్లాలోని ఐదు మండలాల ముఖ్య నేతలు తరలివెళ్లారు.