రాష్ట్రంలో లాక్డౌన్ విధించే పరిస్థితులు లేనేలేవని రాష్ట్ర ప్రజారోగ్యశాఖ సంచాలకుడు శ్రీనివాస్రావు స్పష్టంచేశారు. థర్డ్ వేవ్ వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జనవరి చివర్లో లాక్డౌన్ ఉండొచ్చని సోషల్మీడియాలో తాను చెప్పినట్టు ప్రచారమవుతున్న వార్తలు అవాస్తవమని తేల్చిచెప్పారు. అసత్యాలను ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలని, లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.