పెద్దపల్లి, జనవరి 27: ప్రయాణికులను తక్కువ చార్జీలతో చెన్నై నుంచి ఢిల్లీ.. ఢిల్లీ నుంచి చెన్నైకి తీసుకెళ్లే గరీబ్థ్ (12611/12612) తెలంగాణ రైల్వే స్టేషన్లలో ఎక్కడా ఆగడం లేదు. వీక్లీ ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్గా నడుస్తున్న ఈ రైలులో ప్రయాణించే అవకాశం లేకపోవడంతో రాష్ట్రంలోని సామాన్య మధ్యతరగతి, పేద ప్రజానీకం తీవ్రంగా నష్టపోతున్నది. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి కిషన్రెడ్డితోపాటు మరో ముగ్గురు ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నా దీనిపై వారు పెదవి విప్పకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. 2007 ఫిబ్రవరి నుంచి గరీబ్థ్ (12612/12611) ఏసీ రైళ్లను నడుపుతున్నారు. ఈ రైలు చెన్నై నుంచి ప్రతి శనివారం ఢిల్లీకి, తిరిగి సోమవారం ఢిల్లీలో బయలుదేరి మంగళవారం రాత్రి చెన్నైకి చేరుతుంది. రాష్ట్రంలోని మధిర, ఖమ్మం, డోర్నకల్ జంక్షన్, మహబూబాబాద్, వరంగల్, జమ్మికుంట, పెద్దపల్లి జంక్షన్, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్నగర్ మీదుగా ఢిల్లీకి వెళ్తున్నా ఇకడి స్టేషన్లలో ఆగకపోవడంతో ఈ ప్రాంత వాసులకు ఈ రైలు వల్ల ప్రయోజనం లేకుండాపోయింది. ఇది ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ జంక్షన్లో బయలుదేరితే తిరిగి మహారాష్ట్రలోని బల్లార్షా జంక్షన్లో మాత్రమే ఆగుతున్నది. సుమారు 450 కిలోమీటర్ల పరిధిలో ఎకడా ఆగడం లేదు. ఇదే రైలు ఏపీలోని గూడూరు, ఒంగోలు, విజయవాడ జంక్షన్లలో, మహారాష్ట్రలోని బల్లార్షా, నాగ్పూర్ జంక్షన్లలో, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్, గ్వాలియర్, ఉత్తరప్రదేశ్లోని ఝౌన్సీ జంక్షన్, ఆగ్రాలో ఆగుతున్నది. అయితే తెలంగాణలో కనీసం మూడు, నాలుగు కేంద్రాల్లోనైనా ఆగితే ప్రయోజనకరంగా ఉంటుందని రాష్ట్ర ప్రజలు పేర్కొంటున్నారు. ఇంత పెద్ద సమస్యను కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్ పట్టించుకోక పోవడంపై ప్రజలు మండిపడుతున్నారు.