హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): దేశంలోని మావోయిస్టులు 90 శాతం లొంగిపోయినా కూడా వారి సానుభూతిపరులంటూ ప్రజా సంఘాల నేతలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ‘ఉపా’ చట్టం కింద కేసులు నమోదు చేసి, తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. గత సెప్టెంబర్లో ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కట్టా రాంచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ అంత్యక్రియలను ఆయన స్వగ్రామం సిద్దిపేట జిల్లా, తీగలకుంటపల్లిలో నిర్వహించారు.
ఈ సందర్భంగా అక్కడ ప్రసంగించిన ఇన్నయ్యపై ఎన్ఐఏ కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. ఇంకా మావోయిస్టు సానుభూతిపరులంటూ ఈ కేసులో సుమారు 405 మందికి ఎన్ఐఏ నోటీసులు ఇచ్చింది. వారిలో పలువురిని ఇప్పటికే విచారించింది.
ఈ క్రమంలో పలువురికి ఎన్ఐఏ వరుసగా నోటీసులు జారీచేస్తున్నది. తాజా సమాచారం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 60 మందికి పైగా ఈ నోటీసులు అందుకున్నారు. వీరిలో సిధారెడ్డి సహా కొందరిని వారి ఇండ్ల వద్దకే వెళ్లి విచారించారు. మిగిలినవారు మాదాపూర్లోని ఎన్ఐఏ కార్యాలయంలో విచారణకు హాజరవుతున్నారు.